త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tummala Nageshwar Rao | కేబినెట్‌ భేటీకి మంత్రి తుమ్మ‌ల డుమ్మా..! కార‌ణం అదేనా..?

Tummala Nageshwar Rao | రాష్ట్ర స‌చివాల‌యంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న కొన‌సాగుతున్న మంత్రివ‌ర్గ స‌మావేశానికి వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు హాజ‌రు కాలేదు. మంత్రి తుమ్మ‌ల ఎందుకు కేబినెట్ స‌మావేశానికి హాజ‌రు కాలేద‌ని.. రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగా చ‌ర్చ కొన‌సాగుతోంది.

S

Telangana | Published On Feb 23, 2026, 5.48 pm IST

Tummala Nageshwar Rao | కేబినెట్‌ భేటీకి మంత్రి తుమ్మ‌ల డుమ్మా..! కార‌ణం అదేనా..?
Advertisement

ఉద‌యం సీఎంతో 20 నిమిషాలు భేటీ
అస‌లేం జ‌రిగింది..?
తీవ్ర‌మైన వెన్నునొప్పి కార‌ణ‌మా..?
రైతు భ‌రోసా నిధులే కార‌ణ‌మా..?
రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగా చ‌ర్చ‌..!

Tummala Nageshwar Rao | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్ర స‌చివాల‌యంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న కొన‌సాగుతున్న మంత్రివ‌ర్గ స‌మావేశానికి వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు హాజ‌రు కాలేదు. మంత్రి తుమ్మ‌ల ఎందుకు కేబినెట్ స‌మావేశానికి హాజ‌రు కాలేద‌ని.. రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగా చ‌ర్చ కొన‌సాగుతోంది.

అయితే తీవ్ర‌మైన వెన్ను నొప్పితో కేబినెట్‌కు మంత్రి తుమ్మ‌ల హాజ‌రు కాలేక‌పోయార‌ని తెలుస్తోంది. సోమ‌వారం ఉదయం 10:30 గంటలకు జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రితో నాగేశ్వ‌ర్ రావు సుమారు 20 నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఉద‌యం 10.50 గంట‌ల‌కు సీఎం నివాసం నుంచి మంత్రి వెళ్లిపోయారు. మంత్రివ‌ర్గ స‌మావేశానికి రావ‌డం లేద‌ని ఉద‌య‌మే సీఎంకు చెప్పిన‌ట్లు స‌మాచారం. ఆరోగ్యం కుదుటపడితే కేబినెట్‌ భేటీలో పాల్గొంటానని సీఎంకు మంత్రి తుమ్మల చెప్పినట్లు తెలుస్తోంది. అయితే స‌చివాల‌యంలో మంత్రి తుమ్మల కోసం దాదాపు 45 నిమిషాల పాటు వేచి చూసిన‌ట్లు స‌మాచారం. ఆయన రావడం లేదని తెలిసిన తరవాతే మంత్రివర్గ సమావేశం ప్రారంభ‌మైన‌ట్లు తెలుస్తోంది.

రైతు భ‌రోసా నిధులే కార‌ణ‌మా..?

రైతు భ‌రోసా నిధుల విడుద‌ల విష‌యంలో జాప్యం కొన‌సాగుతున్నందునే మంత్రి తుమ్మ‌ల అల‌క బూనిన‌ట్లు తెలుస్తోంది. మంత్రివ‌ర్గ స‌మావేశం ప్రారంభానికి కొన్ని గంట‌ల ముందు సీఎం రేవంత్ రెడ్డితో స‌మావేశ‌మైన తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు.. అంత‌లోనే డుమ్మా ఎందుకు కొట్టాల్సి వ‌చ్చింద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు ప్ర‌శ్నించుకుంటున్నారు. మున్సిప‌ల్ ఎన్నిక‌లు అయిపోగానే రైతు భ‌రోసా నిధులు విడుద‌ల చేస్తామ‌ని సీఎం రేవంత్ రెడ్డి మిర్యాల‌గూడ స‌భ‌లో బ‌హిరంగంగా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. మున్సిప‌ల్ ఎన్నిక‌లు ముగిసి.. మేయ‌ర్లు, చైర్మ‌న్లు కొలువుదీరిన‌ప్ప‌టికీ.. రైతు భ‌రోసా నిధులు విడుద‌ల కాలేదు. తాజా ప‌రిస్థితుల‌ను చూస్తుంటే.. జ‌డ్పీ ఎన్నిక‌లు అయిపోయాక రైతు భ‌రోసా నిధులు విడుద‌ల కానున్న‌ట్లు తెలుస్తోంది. మొత్తానికి మంత్రి తుమ్మ‌ల కేబినెట్ స‌మావేశానికి గైర్హాజ‌రు కావ‌డంపై ర‌క‌ర‌కాల చ‌ర్చ‌లు వినిపిస్తున్నాయి.

Advertisement
Advertisement