త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

​T Fiber | ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు టీ ఫైబ‌ర్ ద్వారానే ఇంట‌ర్నెట్ సేవ‌లు

​T Fiber | సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు కేవలం టీ-ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు.

S

Telangana | Published On Aug 4, 2026, 3.33 pm IST

​T Fiber | ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు టీ ఫైబ‌ర్ ద్వారానే ఇంట‌ర్నెట్ సేవ‌లు
Advertisement

​T Fiber | త్రినేత్ర‌.న్యూస్ : సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు కేవలం టీ-ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు. సచివాలయంలో 'టీ-ఫైబర్'పై మంత్రి శ్రీధర్ బాబు కీలక సమీక్ష నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి సీఎస్ సంజయ్ జాజు, ఐటీ శాఖ సంయుక్త కార్యదర్శి అనుదీప్ దురిశెట్టి, టీ-ఫైబర్ ఎండీ వేణు ప్రసాద్ హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి శ్రీధ‌ర్ బాబు మాట్లాడుతూ.. ​గడువులోగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇంటర్నెట్ సేవలు అందించేలా ఏర్పాట్లు చేయాలని టీ ఫైబర్ అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ 1 తర్వాత ప్రైవేట్ ఆపరేటర్లకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంటర్నెట్ నిమిత్తం ఎలాంటి బిల్లులు చెల్లించొద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
​'టీ-స్వాన్' (T-SWAN) నెట్‌వర్క్‌ను నెల రోజుల్లోగా టీ-ఫైబర్‌కు బదిలీ చేసేలా చర్యలు తీసుకోవాల‌న్నారు.

​ప్రతిష్టాత్మక 'ఫ్యూచర్ సిటీ'కి కూడా పూర్తిస్థాయిలో టీ-ఫైబర్ ఇంటర్నెట్ సేవలు అందేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశింశారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఇంటింటికి ఇంటర్నెట్' ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు.

Advertisement
Advertisement