త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sridhar Babu | జీసీసీల గమ్యస్థానంగా హైదరాబాద్ : మంత్రి శ్రీధర్ బాబు

Sridhar Babu | ప్రపంచంలోని దిగ్గజ ఫైనాన్స్ సంస్థలన్నీ తమ గ్లోబల్ సామర్థ్య కేంద్రాల(GCC) ఏర్పాటుకు హైదరాబాద్ నగరాన్ని గమ్యస్థానంగా ఎంచుకున్నాయని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు.

S

Telangana | Published On Apr 11, 2026, 5.16 pm IST

Sridhar Babu | జీసీసీల గమ్యస్థానంగా హైదరాబాద్ : మంత్రి శ్రీధర్ బాబు
Advertisement

హైద‌రాబాద్‌లో ఆఫీసు ఆక్యుపెన్సీ 73 శాతం
ముంబైలో కేవ‌లం 52 శాతం మాత్ర‌మే
జీసీసీల‌కు 20 ఏండ్ల‌కు త‌గ్గ‌ట్టు మౌలిక స‌దుపాయాలు

Sridhar Babu | త్రినేత్ర‌.న్యూస్ : ప్రపంచంలోని దిగ్గజ ఫైనాన్స్ సంస్థలన్నీ తమ గ్లోబల్ సామర్థ్య కేంద్రాల(GCC) ఏర్పాటుకు హైదరాబాద్ నగరాన్ని గమ్యస్థానంగా ఎంచుకున్నాయని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. నైపుణ్యాలతో కూడిన టాలెంట్ పూల్, అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు, ట్రాఫిక్ సమస్య లేని రోడ్లు, అందుబాటులో ఉండే అద్దెలు ప్రముఖ కంపెనీలని ఆకర్షిస్తున్నాయని ఆయన తెలిపారు. న్యూయార్క్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే పికో టెక్నాలజి (PICO Technology) సంస్థప్రతినిధులు శనివారం బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు. రోడ్లు, భవనాల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా సమావేశంలో పాల్గొన్నారు.

ఫైనాన్సియల్ మార్కెట్‌కు సంబంధించిన సేవలు అందించే పికో టెక్నాల‌జీ సంస్థ పికో టెక్నాలజీ ఇండియా అనే అనుబంధ కంపెనీ ద్వారా ఇక్కడ జీసీసీ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. ఈ సంసర్భంగా శ్రీధర్ బాబు వారికి ఇక్కడి అవకాశాలు, మౌలిక వసతుల గురించి వివరించారు. రానున్న 5-10 సంవత్సరాలు, తర్వాత 20 సంవత్సరాల అవసరాలకు తగిన విధంగా మౌలిక సదుపాయాలు మెరుగు పర్చేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. బెంగళూరు, ముంబై నగరాలతో పోలిస్తే ఇక్కడ ఆఫీసు స్థలాల ఆక్యుపెన్సీ 73 శాతం ఉందని చెప్పారు. ముంబైలో అది 52 శాతం మాత్రమేనని తెలిపారు. బెంగళూరు, ముంబై వంటి మెట్రో నగరాల్లో ట్రాఫిక్, వాయు కాలుష్యం ప్రధాన సమస్యలుగా మారినందున ఐటీ సంస్థలు, జీసీసీలు హైదరాబాద్‌కు తరలి వస్తున్నాయని తెలిపారు.

రహదారుల అభివృద్ధికి భారీగా నిధులు : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

ఇప్పుడున్న నెహ్రూ రింగ్ రోడ్డుకు 30 కిలోమీట‌ర్ల‌ వెలుపల రీజనల్ రింగ్ రోడ్డు నిర్మిస్తున్నట్టు ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. దానికి అనుబంధంగా రేడియల్ రోడ్లు ఏర్పాటవుతున్నాయ‌ని వివరించారు. రింగ్ రోడ్ల పక్కన రైలు మార్గాన్ని కూడా ఏర్పాటు చేసి రవాణా సదుపాయాలను ప్రపంచంలోని పెద్ద నగరాలను తలదన్నేలా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. హయత్ నగర్ - ఎల్బీనగర్‌ల మధ్య డబుల్ డెక్కర్ రోడ్డు నిర్మిస్తున్నట్టు వివరించారు. కింది రోడ్డు స్థానిక ట్రాఫిక్ అవసరాలకు వినియోగిస్తామని పైన ఉండే రెండు అండు అంతస్థుల రోడ్లు నగరం నుంచి వెలుపలకు, లోపలకి వచ్చే వాహనాల కోసం ప్రత్యేకిస్తామని చెప్పారు. నాగపూర్ తర్వాత డబుల్ డెక్కరో రోడ్లు నిర్మిస్తున్న నగరం ఇదేనని అన్నారు. రెండు నెలల్లో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని చెప్పారు. సమావేశంలో పికో టెక్నాలజి వ్యవస్థాపక సీఈవో జారొడ్ యుస్టర్ (Jarrod Yuster), పికో ఇండియా సీఈవో హరి కోదండరామన్, డైరెక్టర్ సీతారాం తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement