త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Minister Seethakka | ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి సీతక్క

Minister Seethakka | తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.

S

Telangana | Published On Apr 29, 2026, 4.57 pm IST

Minister Seethakka | ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి సీతక్క
Advertisement

Minister Seethakka | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. తెలంగాణ దివ్యాంగుల, వయోవృద్ధుల మరియు ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల సహకార సంస్థ ఆధ్వర్యంలో నిజామాబాద్ పట్టణంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఆవరణలో విద్యార్థులు, దివ్యాంగుల కోసం సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క, పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ హాజరయ్యారు. ఈ సందర్భంగా అర్హులైన దివ్యాంగులకు ద్విచక్ర వాహనాలు, బ్యాటరీ ట్రైసైకిళ్లు, ఆటో, వీల్‌చైర్స్‌తో పాటు పలు సహాయక ఉపకరణాలను అందజేశారు. అనంతరం సీతక్క మాట్లాడుతూ టీనేజ్ బాలికల కోసం స్నేహ సమ్మర్ ప్రోగ్రాం లో భాగంగా సైకిల్ రైడింగ్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో బైక్ రైడింగ్ ను నేర్చుకునేందుకు అనువుగా ఉండేందుకు గ్రామ గ్రామాన టీనేజీ బాలికలకు సమ్మర్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో భాగంగా లైఫ్ స్కిల్స్ ను సెర్ప్ ఆధ్వర్యంలో నేర్పిస్తున్నట్లు వివరించారు. అందులో భాగంగా సైకిల్ రైడింగ్ శిక్షణ అందిస్తున్నట్లు చెప్పారు. అమ్మకు అక్షరమాలలో భాగంగా మహిళలకు విద్యా బోధన, అక్షరాలు చదవడం రాయడం నేర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12 లక్షల మందికి విద్యాబోధన చేస్తున్నామన్నారు.

Advertisement
Advertisement