Ponnam Prabhakar | ఎన్ని వైరుధ్యాలున్నా.. శంకరుని పరివారంలా కలిసి ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్
Ponnam Prabhakar | వారంతా ఒకే కుటుంబంలో సభ్యులు. ఒకరంటే ఒకరు పడకపోవడం వారి సహజగుణం. అయినా వారిమధ్య ఎన్ని వైరుధ్యాలున్నప్పటికీ కుటుంబం అనే భావన వచ్చేటప్పటికీ అంతా కలిసే ఉంటారు.
Ponnam Prabhakar | త్రినేత్ర.న్యూస్: వారంతా ఒకే కుటుంబంలో సభ్యులు. ఒకరంటే ఒకరు పడకపోవడం వారి సహజగుణం. అయినా వారిమధ్య ఎన్ని వైరుధ్యాలున్నప్పటికీ కుటుంబం అనే భావన వచ్చేటప్పటికీ అంతా కలిసే ఉంటారు. దీనికి మంచి ఉదాహరణే శంకరుని పరివారం. కుటుంబంలా అంతా కలిసి ఉంటేనే సమాజంలో ఎదుగుతామని శంకరుని కుటుంబ పరివారానికి సంబంధించిన ఫొటోను అసెంబ్లీలో చూపిస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) వివరించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బలహీన వర్గాలకు సంబంధించి సభ్యులు లేవనెత్తిన అంశాలకు మంత్రి సమాధానమిస్తూ.. ఇది శంకరుని కుటుంబ పరివారానికి సంబంధించిన ఫొటో. ఇందులో శంకరుని వాహనం నంది. పార్వతి వాహనం సింహం. కుమార స్వామి వాహనం నెమలి. విఘ్నేష్వరుని వాహనం ఎలుక. ఇందులో ఒకదానికి ఒకటి పడదు. నెమలికి ఎలుకకు పడదు. ఎద్దుకు, సింహానికి పడదు. కానీ వారంతా ఒక పరివారంగా కలిసి ఉంటారు. శివుని కుటుంబం లాగా బలహీన వర్గాలకు సంబంధించిన విషయంలో కూడా మనం కలిసి ఉండాలని చెప్పారు.
బీసీలకు సంబంధించిన సంక్షేమం నేడు చాలా అవసరం ఉన్నది. నాయకులు ఏ పార్టీకి చెందినవారైనప్పటికీ బీసీలకు సంబంధించిన విషయంలో అంతా ఒక్కటిగానే ఉండాలని చెప్పారు. మహాత్మా జ్యోతిబా పూలే చెప్పినట్లుగా ఏ సమాజమైనా అభివృద్ధి సాధించాలంటే విద్యే ప్రధాన ఆయుధం. విద్య ద్వారానే వెనుకబడిన వర్గాల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందనే విశ్వాసంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. విద్యార్థుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. గురుకులాల్లో మౌలిక వసతులు పెంచుతున్నామని తెలిపారు. ఆయా పాఠశాలల్లో చదువుకుని అనేకమంది విద్యార్థులు ఉన్నత స్థానాలకు వెళ్లారన్నారు. విద్యార్థుల కోసం వంద సమీకృత హాస్టళ్లను నిర్మిస్తున్నామని తెలిపారు. రాాష్ట్ర వ్యాప్తంగా ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తున్నామని చెప్పారు. బీసీల అభివృద్ధి గురించి బీఆర్ఎశ్ ప్రభుత్వం చేసేందేమి లేదని ఎద్దేవా చేశారు. బీసీల అభివృద్ధి గురించి విపక్ష నేతలు మంచి సలహాలు ఇవ్వాలని సూచించారు. బలహీనవర్గాలకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నదని చెప్పారు.
https://www.youtube.com/watch?v=4PTQMTz2JCI
సంబంధిత వార్తలు

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
మే 21, 2026

Ponnam Prabhakar | ‘సర్’ పై అప్రమత్తంగా ఉందాం: నియోజకవర్గ ఇంచార్జీలు, పరిశీలకులతో పొన్నం
మే 16, 2026

TG Govt | తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కోసం కమిటీ.. చైర్మన్గా కే కేశవరావు
మే 15, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



