త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Journalists | జ‌ర్న‌లిస్టుల‌కు 44 వేల‌కు పైగా అక్రిడిటేష‌న్ కార్డులు

Telangana Journalists | రాష్ట్రంలోని జ‌ర్న‌లిస్టుల‌కు శుభ‌వార్త. అర్హులైన జ‌ర్న‌లిస్టులంద‌రికీ అక్రిడిటేష‌న్ కార్డులు జారీ చేస్తామ‌ని రాష్ట్ర స‌మాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు.

S

Telangana | Published On Feb 12, 2026, 8.27 pm IST

Telangana Journalists | జ‌ర్న‌లిస్టుల‌కు 44 వేల‌కు పైగా అక్రిడిటేష‌న్ కార్డులు
Advertisement

అర్హులంద‌రికీ న్యాయం చేస్తాం..
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ

Telangana Journalists | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలోని జ‌ర్న‌లిస్టుల‌కు శుభ‌వార్త. అర్హులైన జ‌ర్న‌లిస్టులంద‌రికీ అక్రిడిటేష‌న్ కార్డులు జారీ చేస్తామ‌ని రాష్ట్ర స‌మాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. జర్నలిస్టుల సంక్షేమం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో పనిచేస్తోందని పేర్కొన్నారు.

అక్రిడిటేషన్ కార్డుల జారీ విధానం, అక్రిడిటేషన్ కమిటీ ఏర్పాటు తదితర అంశాలపై స‌మాచార‌, పౌర‌సంబంధాల శాఖ క‌మిష‌న‌ర్ ప్రియాంక‌, సీఎం సీపీఆర్వో మ‌ల్సూర్‌ల‌తో మంత్రి పొంగులేటి సమావేశ‌మై సుదీర్ఘంగా చ‌ర్చించారు. అక్రిడిటేష‌న్ కార్డుల‌ను పార‌ద‌ర్శ‌కంగా జారీ చేయాల‌ని ఆదేశించారు.

అక్రిడిటేషన్ కార్డుల జారీకి సంబంధించి ప్రభుత్వం ముందుగా జి.ఓ. 252 జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. అనంతరం జర్నలిస్టు సంఘాలతో సమావేశమై వారి సూచనలు, అభిప్రాయాలను సవివరంగా పరిగణనలోకి తీసుకొని అవసరమైన సవరణలు చేసి జి.ఓ. 103ను జారీ చేసినట్లు వెల్లడించారు. ఈ సవరణల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా విభాగాల్లో మొత్తం 44,706 అక్రిడిటేషన్ కార్డులు పొందే అవకాశం కలుగుతుంద‌న్నారు. గతంలో సుమారు 23 వేల మందికి మాత్రమే అక్రిడిటేషన్ కార్డులు ఉండగా, తాజా నిర్ణయంతో దాదాపు 21 వేలకు పైగా కార్డుల సంఖ్య పెరుగుతుంద‌ని మంత్రి వివరించారు.

అక్రిడిటేష‌న్ కార్డులు జారీ ఇలా..

2.50 ల‌క్ష‌ల పైగా స‌ర్క్యులేష‌న్ ఉన్న 8 పత్రికలకు 6,256 కార్డులు, 75 వేల నుండి 2.50 లక్షల వ‌ర‌కు సర్క్యులేషన్ ఉన్న24 పత్రికలకు 17,784 కార్డులు , 25001 నుంచి 75 వేల వ‌ర‌కు స‌ర్క్యులేష‌న్ ఉన్న‌ 30 ప‌త్రిక‌ల‌కు 3,390, అదేవిధంగా 15001 నుంచి 25000 వ‌ర‌కు స‌ర్క్యులేష‌న్ ఉన్న 169 చిన్న ప‌త్రిక‌ల‌కు 11,661 , 15వేలలోపు సర్క్యులేష‌న్ ఉన్న 113 చిన్న ప‌త్రిక‌ల‌కు 226, పీరియాడిక‌ల్స్‌కు 624, 20 న్యూస్ ఏజ‌న్సీల‌కు 68 అక్రిడిటేష‌న్‌లు పొందుతాయ‌ని తెలిపారు.

అలాగే 21 శాటిలైట్ ఛానళ్లకు 4,431 కార్డులు, 8 జాతీయ ఛాన‌ల్స్‌కు 32, వంద లోకల్ కేబుల్ ఛానళ్లకు 200 ,డిజిటల్ మీడియా విభాగానికి 10 కార్డులు మొత్తంగా 44,706 కార్డులు కేటాయించిన‌ట్లు తెలిపారు. ఇందులో రాష్ట్ర, జిల్లా స్థాయిలో 16,056, నియోజకవర్గ, మండల స్థాయిలో 28,650 మంజూరు చేస్తున్న‌ట్లు తెలిపారు.

అక్రిడిటేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని, అవసరాన్ని బట్టి మరోసారి సమావేశమై తదుపరి చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్థంభంగా ఉన్న మీడియా ప్రతినిధుల గౌరవం, భద్రత, సంక్షేమం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.

Advertisement
Advertisement