త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Konda Surekha | నా కుమార్తె చేసిన వ్యాఖ్యలకు నేనెలా బాధ్యురాలినవుతాను

Konda Surekha | నా కుమార్తె సుష్మిత చేసిన వ్యాఖ్య‌ల‌కు నేనెలా బాధ్యురాలిన‌వుతాను అని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. సుస్మిత వ్యాఖ్య‌లు పూర్తిగా ఆమె వ్య‌క్తిగ‌త‌మ‌ని సురేఖ స్ప‌ష్టం చేశారు.

S

Telangana | Published On Aug 20, 2026, 6.06 pm IST

Konda Surekha | నా కుమార్తె చేసిన వ్యాఖ్యలకు నేనెలా బాధ్యురాలినవుతాను
Advertisement

ఆమె వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగతం
టీ పీసీసీ క్రమశిక్షణా కమిటీకి మంత్రి కొండా సురేఖ వివరణ

Konda Surekha | త్రినేత్ర‌.న్యూస్ : నా కుమార్తె సుష్మిత చేసిన వ్యాఖ్య‌ల‌కు నేనెలా బాధ్యురాలిన‌వుతాను అని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. సుస్మిత వ్యాఖ్య‌లు పూర్తిగా ఆమె వ్య‌క్తిగ‌త‌మ‌ని సురేఖ స్ప‌ష్టం చేశారు. ఈ మేర‌కు తన వివరణతో కూడిన లేఖను టీ పీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవికి మంత్రి సురేఖ పంపించారు.

ఆగస్టు 19న తన జన్మదినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ‘కొండా’ కుటుంబ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పలుచోట్ల వేడుకలు నిర్వహించడంతో పాటు సేవా కార్యక్రమాలు చేపట్టారని లేఖలో మంత్రి తెలిపారు. తన స్వస్థలమైన గీసుకొండతో తన కూతురు సుస్మితా పటేల్‌కు వున్న ప్రత్యేక అనుబంధం కారణంగా అక్కడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు నిర్వహించిన జన్మదిన వేడుకల్లో తన కుమార్తె కొండా సుస్మితా పటేల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారని వివరించారు.

ఆ కార్యక్రమంలో తన కుమార్తె చేసిన వ్యాఖ్యలు పూర్తిగా తన వ్యక్తిగత అభిప్రాయమని మంత్రి స్పష్టం చేశారు. కుటుంబ బాంధవ్యం కారణంగా ఒకరి వ్యక్తిగత అభిప్రాయాలకు మరొకరు రాజకీయంగా బాధ్యత వహించాలనడం, ఆ ప్రాతిపదికన వివరణ కోరడం సముచితం కాదని మంత్రి సురేఖ పేర్కొన్నారు. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిగా చేయడం సహజ న్యాయ స్ఫూర్తికి విరుద్ధమని వివరించారు.

కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై, పార్టీ క్రమశిక్షణా నియమావళిపై తనకు సంపూర్ణ గౌరవం ఉందని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య విలువలు, వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఈ విషయంలో తన ప్రమేయం లేదని గుర్తించి, తనకు జారీ చేసిన నోటీసును ఉపసంహరించుకోవాలని క్రమశిక్షణా కమిటీకి గౌరవపూర్వకంగా విజ్ఞప్తి చేశారు.

Advertisement
Advertisement