త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jupally Krishna Rao | నాగర్ కర్నూల్ జిల్లాలో మంత్రి జూపల్లి రైస్ మిల్లుల్లో ఆకస్మిక తనిఖీలు!

Jupally Krishna Rao | నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లాలో మంత్రి జూప‌ల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) రైసు మిల్లుల్లో ఆక‌స్మిక త‌నిఖీలు నిర్వ‌హించారు. మిల్లుల్లో ధాన్యం అన్‌లోడింగ్ ప్ర‌క్రియ‌పై ఆరాతీశారు.

G

Telangana | Published On May 25, 2026, 10.37 am IST

Jupally Krishna Rao | నాగర్ కర్నూల్ జిల్లాలో మంత్రి జూపల్లి రైస్ మిల్లుల్లో ఆకస్మిక తనిఖీలు!
Advertisement

Jupally Krishna Rao | త్రినేత్ర‌.న్యూస్‌: నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లాలో మంత్రి జూప‌ల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) రైసు మిల్లుల్లో ఆక‌స్మిక త‌నిఖీలు నిర్వ‌హించారు. మిల్లుల్లో ధాన్యం అన్‌లోడింగ్ ప్ర‌క్రియ‌పై ఆరాతీశారు. సోమ‌వారం ఉద‌యం జిల్లా కేంద్రంలోని సత్యసాయి రైస్ మిల్లు, చందుబట్ల మండలంలోని శ్రీ వెంకటేశ్వర ఆగ్రో ఇండస్ట్రీస్‌ను ఆక‌స్మికంగా ప‌రిశీలించారు. రోజుల తరబడి ధాన్యం అన్‌లోడ్ చేయకుండా లారీలను నిలిపివేయడంపై మిల్లు యాజమాన్యాలపై ఆగ్రహం వ్య‌క్తం చేశారు.

తాలు, తరుగు పేరుతో రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చ‌రించారు. రైతులకు నష్టం కలిగించే వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రైస్ మిల్లులు, గోదాముల వద్ద ప్రతి లారీ అన్‌లోడ్ అయ్యేలా పర్యవేక్షించాలని జిల్లా ఎస్పీని ఆదేశించారు. మిల్లులు, గోదాముల వద్ద పోలీస్ నిఘా ఏర్పాటు చేయాలన్నారు.

కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం పేరుకుపోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం నిల్వలు పెరగకుండా, వెంటనే మిల్లులకు తరలించి అన్‌లోడ్ చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.

Advertisement
Advertisement