త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Damodar Rajanarsimha | మరో 50 ఏళ్లు చెక్కుచెదరకుండా సింగూరు డ్యామ్.. పర్యాటక కేంద్రంగా అభివృద్ధి: దామోదర్ రాజనర్సింహ

ఆందోల్ నియోజకవర్గంలోని సింగూరు ప్రాజెక్టును రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సందర్శించారు. డ్యామ్ సేఫ్టీ పనులు, పర్యాటక అభివృద్ధిపై ఇరిగేషన్, టూరిజం అధికారులతో సమీక్షించారు.

J

Telangana | Published On Apr 13, 2026, 8.47 pm IST

Damodar Rajanarsimha | మరో 50 ఏళ్లు చెక్కుచెదరకుండా సింగూరు డ్యామ్.. పర్యాటక కేంద్రంగా అభివృద్ధి: దామోదర్ రాజనర్సింహ

సంక్షిప్త సారాంశం

మంత్రి దామోదర్ రాజనర్సింహ సింగూరు ప్రాజెక్టు వద్ద జరుగుతున్న డ్యామ్ సేఫ్టీ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిబంధనల మేరకు వచ్చే 50 ఏళ్ల పాటు డ్యామ్ పటిష్టంగా ఉండేలా పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే సింగూరు ఐలాండ్ అభివృద్ధి, ఆందోల్ పెద్ద చెరువు బ్యూటిఫికేషన్, ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులపై ఆరా తీశారు. అనంతరం గురుకుల పాఠశాల విద్యార్థులతో ముచ్చటించి, మౌలిక సదుపాయాల కల్పనకు ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

Damodar Rajanarsimha | త్రినేత్ర.న్యూస్ : సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గ పరిధిలోని సింగూరు ప్రాజెక్టును రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు భద్రత, పర్యాటక అభివృద్ధి, సాగునీటి పనులు, విద్యాసంస్థల నిర్మాణాలపై అధికారులతో ఆయన సుదీర్ఘంగా సమీక్షించారు. క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

డ్యామ్ సేఫ్టీ.. పర్యాటక శోభ

ఇరిగేషన్ అధికారులు చేపడుతున్న సింగూరు డ్యామ్ సేఫ్టీ పనులను మంత్రి స్వయంగా పరిశీలించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిబంధనల మేరకు.. రాబోయే 50 ఏళ్ల పాటు ప్రాజెక్టు చెక్కుచెదరకుండా నిలిచేలా అత్యున్నత ప్రమాణాలతో నిర్మాణ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పనుల వేగవంతానికి అడ్డంకిగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించుకోవాలని సూచించారు.

Minister Damodar Rajanarsimha Reviews Singur Dam Safety Focuses on Tourism and Education in Andole

అనంతరం సింగూరు ప్రాజెక్టు ఐలాండ్ (దీవి) అభివృద్ధిపై టూరిజం, ఇరిగేషన్ అధికారులతో జాయింట్ మీటింగ్ నిర్వహించారు. ప్రాజెక్టు డ్యామ్ బ్యూటిఫికేషన్‌తో పాటు.. ఐలాండ్ అభివృద్ధి, బోటింగ్, పార్కులు, గార్డెన్ బ్యూటిఫికేషన్, కాటేజీల నిర్మాణం, రెస్టారెంట్, వాటర్ స్పోర్ట్స్ వంటి సదుపాయాలను ఏర్పాటు చేసి పర్యాటకులను ఆకర్షించేలా చర్యలు తీసుకోవాలన్నారు. త్వరలోనే డ్యామ్ సేఫ్టీ, పర్యాటక అభివృద్ధిపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహిస్తామని మంత్రి వెల్లడించారు.

సాగునీటి పనులు, చెరువుల బ్యూటిఫికేషన్

పర్యటనలో భాగంగా సింగూరు ప్రాజెక్టుకు చెందిన సిలారపు రాజనర్సింహ ప్రధాన కాలువ లైనింగ్ పనులను మంత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పెద్దారెడ్డి పేట లిఫ్ట్ ఇరిగేషన్ పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. అలాగే, ఆందోల్ పెద్ద చెరువు ట్యాంక్ బండ్ బ్యూటిఫికేషన్ పనులు చేపట్టి, దానిని ఒక చక్కటి పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు.

Minister Damodar Rajanarsimha Reviews Singur Dam Safety Focuses on Tourism and Education in Andole

విద్యాభివృద్ధికి పెద్దపీట.. విద్యార్థులతో ముఖాముఖి

ఆందోల్ నియోజకవర్గంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'ఇంటిగ్రేటెడ్ స్కూల్' పనులను మంత్రి పరిశీలించారు. భవన నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తేవాలని ఆదేశించారు.

అనంతరం సింగూరు ప్రాజెక్టు వద్ద ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను మంత్రి దామోదర్ రాజనర్సింహ సందర్శించారు. గురుకుల విద్యార్థులతో ఆత్మీయంగా ముచ్చటించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో విద్యార్థులకు మరింత మెరుగైన మౌలిక సదుపాయాలు, క్రీడా ప్రాంగణాలు (స్పోర్ట్స్ ఫెసిలిటీస్) కల్పించేందుకు అవసరమైన ప్రతిపాదనలు తక్షణమే రూపొందించాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు.

Minister Damodar Rajanarsimha Reviews Singur Dam Safety Focuses on Tourism and Education in Andole

Advertisement
Advertisement