త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nirmal | స‌ర్పంచ్ ఆత్మ‌హ‌త్యాయ‌త్నం.. ఆస్ప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా రోడ్డు ప్ర‌మాదంలో మృతి

Nirmal | పురుగుల మందు సేవించి ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డ్డ స‌ర్పంచ్‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా.. రోడ్డు ప్ర‌మాదానికి గురై మృతి చెందింది.

S

Telangana | Published On Apr 3, 2026, 6.34 pm IST

Nirmal | స‌ర్పంచ్ ఆత్మ‌హ‌త్యాయ‌త్నం.. ఆస్ప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా రోడ్డు ప్ర‌మాదంలో మృతి
Advertisement

Nirmal | త్రినేత్ర‌.న్యూస్ : పురుగుల మందు సేవించి ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డ్డ స‌ర్పంచ్‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా.. రోడ్డు ప్ర‌మాదానికి గురై మృతి చెందింది. ఈ విషాద ఘ‌ట‌న నిర్మ‌ల్ జిల్లా క‌డెం మండ‌లం మాసాయిపేట గ్రామంలో చోటు చేసుకుంది.

మాసాయిపేట గ్రామానికి చెందిన స‌ర్పంచ్ ల‌హ‌రిక‌.. శుక్ర‌వారం పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసింది. గ‌మ‌నించిన కుటుంబ స‌భ్యులు ఆమెను కారులో ఆస్ప‌త్రికి త‌రలిస్తుండ‌గా, రోడ్డు ప‌క్క‌న నిలిపి ఉంచిన ట్రాక్ట‌ర్‌ను బ‌లంగా ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ల‌హ‌రిక ప‌రిస్థితి మ‌రింత విష‌మించి మార్గ‌మ‌ధ్య‌లోనే ప్రాణాలు కోల్పోయింది. లహరిక ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement
Advertisement