త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | పంట కాలిన‌ రైతుల‌ను వెంట‌నే ఆదుకోండి: అధికారుల‌కు సీఎం రేవంత్ ఆదేశం

CM Revanth Reddy | విద్యుదాఘాతం కారణంగా మొక్క‌జొన్న(Maize) పంట కాలిపోయిన బాధిత రైతుల‌ను వెంట‌నే ఆదుకోవాల‌ని సీఎం రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. నిర్మల్ (Nirmal) జిల్లా పెంబి మండల కేంద్రంలో చేతికొచ్చిన మొక్కజొక్క పంట కాలిపోయిన ఘ‌ట‌నపై సీఎం వెంట‌నే స్పందించారు. ఆర్థిక సహాయం అందించాల‌ని సూచించారు.

S

News | Published On Apr 30, 2026, 1.25 pm IST

CM Revanth Reddy | పంట కాలిన‌ రైతుల‌ను వెంట‌నే ఆదుకోండి: అధికారుల‌కు సీఎం రేవంత్ ఆదేశం
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: విద్యుదాఘాతం కారణంగా మొక్క‌జొన్న(Maize) పంట కాలిపోయిన బాధిత రైతుల‌ను వెంట‌నే ఆదుకోవాల‌ని సీఎం రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. నిర్మల్ (Nirmal) జిల్లా పెంబి మండల కేంద్రంలో చేతికొచ్చిన మొక్కజొక్క పంట కాలిపోయిన ఘ‌ట‌నపై సీఎం వెంట‌నే స్పందించారు. జిల్లా క‌లెక్ట‌ర్ అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని సూచించారు.

నిర్మ‌ల్ జిల్లాలో జ‌ర‌గిన ఘ‌ట‌న‌పై బాధిత రైతులు ఆవేదనలో ఉన్నారన్న సమాచారంపై ముఖ్య‌మంత్రి స్పందించారు. ఆ సంఘటనకు సంబంధించిన‌ పూర్తి వివరాలు పరిశీలించాల‌న్నారు. నష్టపోయిన రైతులకు తగిన విధంగా ఆదుకోవాలని, ఆర్థిక సహాయం అందించాలని సీఎంవో అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలందిన వెంట‌నే స్థానిక అధికారులు, జిల్లా కలెక్టర్ అవసరమైన చర్యలు చేపట్టారు.

పంట చేనులోనే మ‌హిళా రైతులు క‌న్నీటిప‌ర్యంత‌మ‌య్యారు. చేతికొచ్చిన మొక్క‌జొన్న క‌ళ్ల ముందే కాలిపోవ‌డంతో దిక్కుతోచ‌ని స్థితిలో ఉండిపోయారు. ఆరుగాలం క‌ష్ట‌ప‌డి, ఎండ‌న‌క, వాన‌న‌కా క‌న్న బిడ్డ‌లా పంట‌ను పెంచుకున్నామ‌ని బోరున విల‌పించారు. కాలిపోయిన కంకుల‌ను చూపిస్తూ మ‌నో వేద‌న‌కు గుర‌య్యారు. ప్ర‌భుత్వం త‌మ‌ను ఆదుకోవాల‌ని వేడుకుంటున్నారు.

చేతికొచ్చిన పంట నోటికంద‌లే.. ఇది వ్య‌వ‌స్థ వైఫల్య‌మే: భూక్యా జాన్స‌న్ నాయ‌క్, బీఆర్ఎస్ నాయ‌కులు, ఖానాపూర్‌

ఖానాపూర్ నియోజకవర్గంలోని పెంబి మండలంలో విద్యుత్ తీగల షార్ట్ సర్క్యూట్ కారణంగా కోతకు సిద్ధంగా ఉన్న 5 ఎకరాల పైన మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమైంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట రైతుల కళ్లముందే కాలిపోయింది. బాధిత‌ రైతు కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. చేతికి వచ్చిన పంట నోటికి అందలేదు. అనే రైతు ఆవేదన హృదయాన్ని కలచివేస్తోంది. ఇది కేవలం ఒక రైతు నష్టమే కాదు.. వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనం. సంబంధిత అధికారులు వెంటనే ఘటన స్థలాన్ని పరిశీలించి, నష్టాన్ని అంచనా వేసి, బాధిత రైతుకు తక్షణ ఆర్థిక సహాయం, పూర్తి నష్టపరిహారం అందించాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా విద్యుత్ శాఖ కఠిన చర్యలు తీసుకోవాలి.

 

View this post on Instagram

 

A post shared by Zindagi Media (@zindagi_media)

Advertisement
Advertisement