త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | రేపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

CM Revanth Reddy | ఈ నెల 6వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. సోమ‌వారం ఉద‌యం 11 గంటలకు నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి అమ్మవారిని సీఎం ద‌ర్శించుకోనున్నారు.

S

Telangana | Published On Apr 5, 2026, 7.18 pm IST

CM Revanth Reddy | రేపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : ఈ నెల 6వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. సోమ‌వారం ఉద‌యం 11 గంటలకు నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి అమ్మవారిని సీఎం ద‌ర్శించుకోనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు బాసర ఆలయ విస్తరణ అభివృద్ధి పనులకు సంబంధించి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఆదిలాబాద్ జిల్లా పిప్రి చేరుకోనున్నారు. పిప్రిలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు పిప్రిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు సీఎం రేవంత్ హాజ‌రై ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించ‌నున్నారు.

Advertisement
Advertisement