త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bhuvanagiri | భ‌ర్త‌తో గొడ‌వ‌.. ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

Bhuvanagiri | యాదాద్రి భువనగిరి (Bhuvanagiri) జిల్లా గొల్లెగూడెంలో దారుణం చోటుచేసుకుంది. భార్యాభ‌ర్త‌ల గొడ‌వ‌కు అబంశుభం తెలియ‌ని ఇద్దరు చిన్నారులు బ‌ల‌య్యారు. త‌న ఇద్ద‌రు పిల్లలను చంపిన మ‌హిళ‌, తానూ ఆత్మహత్య చేసుకున్న‌ది.

G

Telangana | Published On Mar 3, 2026, 1.23 pm IST

Bhuvanagiri | భ‌ర్త‌తో గొడ‌వ‌.. ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

పెళ్లైన నెలకే న‌వ వ‌ధువు ఆత్మ‌హ‌త్య‌

Advertisement

Bhuvanagiri | త్రినేత్ర‌.న్యూస్‌: యాదాద్రి భువనగిరి (Bhuvanagiri) జిల్లా గొల్లెగూడెంలో దారుణం చోటుచేసుకుంది. భార్యాభ‌ర్త‌ల గొడ‌వ‌కు అబంశుభం తెలియ‌ని ఇద్దరు చిన్నారులు బ‌ల‌య్యారు. త‌న ఇద్ద‌రు పిల్లలను చంపిన మ‌హిళ‌, తానూ ఆత్మహత్య చేసుకున్న‌ది.

గొల్లెగూడానికి చెందిన ఐశ్వ‌ర్యకు 10 నెలల శిశువు, రెండేండ్ల కుమారుడు ఉన్నారు. ఆమె భ‌ర్త రైల్వేలో ఉద్యోగం చేస్తున్నారు. గ‌త కొంత‌కాలంగా భర్యాభ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలో తొలుత త‌న‌ ఇద్ద‌రు పిల్ల‌ల‌ను చంపిన ఐశ్వ‌ర్య.. ఆ తర్వాత తాను కూడా బలవన్మరణానికి పాల్పడింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement