త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Maoists | మావోయిస్టుల‌కు మ‌రో ఎదురుదెబ్బ.. లొంగిపోయిన‌ అగ్రనేతలు

Maoists | వ‌రుస ఎన్‌కౌంట‌ర్లు, క్యాట‌ర్‌, లీడ‌ర్ల‌ లొంగుబాట్లు, భ‌ద్ర‌తా ద‌ళాల ఉక్కుపాదంతో కోలుకోలేని స్థితిలో ఉన్న‌ మావోయిస్టు పార్టీకి (Maoists) మ‌రో ఎదురుదెబ్బ త‌గిలింది. మావోయిస్టు టాప్ క‌మాండ‌ర్ దేవ్ జీ (Devji) అలియాస్ తిప్పిరి తిరుప‌తి (Tippiri Tirupati), కేంద్ర క‌మిటీ స‌భ్యుడు మ‌ల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్‌ పోలీసుల ఎదుట లొంగిపోయారు.

G

Telangana | Published On Feb 22, 2026, 11.19 am IST

Maoists | మావోయిస్టుల‌కు మ‌రో ఎదురుదెబ్బ.. లొంగిపోయిన‌ అగ్రనేతలు
Advertisement

Maoists | త్రినేత్ర‌.న్యూస్‌: వ‌రుస ఎన్‌కౌంట‌ర్లు, క్యాట‌ర్‌, లీడ‌ర్ల‌ లొంగుబాట్లు, భ‌ద్ర‌తా ద‌ళాల ఉక్కుపాదంతో కోలుకోలేని స్థితిలో ఉన్న‌ మావోయిస్టు పార్టీకి (Maoists) మ‌రో ఎదురుదెబ్బ త‌గిలింది. మావోయిస్టు టాప్ క‌మాండ‌ర్ దేవ్ జీ (Devji) అలియాస్ తిప్పిరి తిరుప‌తి (Tippiri Tirupati), కేంద్ర క‌మిటీ స‌భ్యుడు మ‌ల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్‌, నర్సింహారెడ్డి అలియాస్‌ గంగన్న పోలీసుల ఎదుట లొంగిపోయారు. వారితో స‌హా 16 మంది మావోయిస్టులు తెలంగాణ ఎస్ఐబీకి స‌రెండ‌ర్ అయ్యారు. ఈ కీల‌క నేత‌లే టార్గెట్‌గా కేంద్ర బ‌ల‌గాలు ఇటీవ‌ల తెలంగాణ‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్ స‌రిహ‌ద్దుల్లోని కర్రెగుట్ట‌ల్లో ఆప‌రేష‌న్ క‌గార్‌-2 మొదలు పెట్టిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే వారు కుమ్రం భీం ఆసిఫాబాద్ అడవుల్లో లొంగిపోయిన‌ట్లు తెలుస్తున్న‌ది. దీనిపై ఒకటి రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

1983లో అజ్ఞాతంలోకి..

తిప్పిరి తిరుపతి స్వ‌స్థ‌లం జగిత్యాల జిల్లాలోని కోరుట్ల. అతని తండ్రి పేరు వెంకట్ నర్సయ్య. 1983లో మావోయిస్టు ఉద్యమంలో చేరిన తిరుప‌తి.. క్రమంగా ఉన్నత స్థానానికి ఎదిగి దక్షిణ భారత జోన్ ఆపరేటర్‌గా పనిచేశారు. ఆయ‌న‌ పేరు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉంది, పార్టీ లోపల అతన్ని సంజీవ్, చేతన్, రమేష్, సుదర్శన్, దేవన్న అని పిలుస్తారు.

2010 ఏప్రిల్‌లో దంతెవాడలో జరిగిన మావోయిస్టు దాడిలో 74 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్ల మృతికి తిరుపతి ప్రధాన సూత్రధారి అని పోలీసులు భావిస్తున్నారు. నంబల కేశవరావు మరణం తరువాత , తిరుపతి సెప్టెంబర్ 2025లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.

Advertisement
Advertisement