త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chandrupatla Ram Reddy | మంథ‌ని మాజీ ఎమ్మెల్యే చంద్రుప‌ట్ల రాంరెడ్డి మృతి

Chandrupatla Ram Reddy | మంథ‌ని మాజీ ఎమ్మెల్యే చంద్రుప‌ట్ల రాంరెడ్డి(80) మంగ‌ళ‌వారం ఉద‌యం క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న ఆయ‌న హైద‌రాబాద్‌లోని ఓ ప్ర‌యివేటు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

S

Telangana | Published On Feb 3, 2026, 2.50 pm IST

Chandrupatla Ram Reddy | మంథ‌ని మాజీ ఎమ్మెల్యే చంద్రుప‌ట్ల రాంరెడ్డి మృతి
Advertisement

Chandrupatla Ram Reddy | త్రినేత్ర‌.న్యూస్ : మంథ‌ని మాజీ ఎమ్మెల్యే చంద్రుప‌ట్ల రాంరెడ్డి(80) మంగ‌ళ‌వారం ఉద‌యం క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న ఆయ‌న హైద‌రాబాద్‌లోని ఓ ప్ర‌యివేటు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రాంరెడ్డి మృతిప‌ట్ల ఆయా పార్టీల రాజ‌కీయ నేత‌లు, ప‌లువురు ప్ర‌ముఖులు సంతాపం ప్ర‌క‌టించారు. కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు.

ముత్తారం మండ‌లం క‌మ్మంప‌ల్లి గ్రామానికి చెందిన రాంరెడ్డి గ్రామ సర్పంచ్‌గా త‌న రాజ‌కీయ ప్ర‌స్థానాన్ని ప్రారంభించారు. ఆ త‌ర్వాత ముత్తారం మండ‌ల ఎంపీపీగా సేవ‌లందించారు. 199లో మంథ‌ని నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి గెలుపొందారు.

రాంరెడ్డికి ఇద్ద‌రు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు విదేశాల్లో స్థిర‌ప‌డ్డాడు. చిన్న కుమారుడు సునీల్ రెడ్డి రాజ‌కీయాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ప్ర‌స్తుతం బీజేపీలో కొన‌సాగుతున్నారు. రాంరెడ్డి అంత్య‌క్రియంలో మంథ‌నిలో బుధ‌వారం జ‌ర‌గ‌నున్నాయి.

Advertisement
Advertisement