త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nadendla Bhaskara Rao | ఉమ్మ‌డి ఏపీ మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత

Nadendla Bhaskara Rao | ఉమ్మ‌డి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు (Nadendla Bhaskara Rao) క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా వయో సంబంధిత సమస్యలతో హైద‌రాబాద్‌లోని ఓ ద‌వాఖాన‌లో చికిత్స పొందుతున్న ఆయ‌న బుధ‌వారం ఉద‌యం తుదిశ్వాస విడిచారు.

G

National | Published On Apr 22, 2026, 1.12 pm IST

Nadendla Bhaskara Rao | ఉమ్మ‌డి ఏపీ మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత
Advertisement

Nadendla Bhaskara Rao | త్రినేత్ర‌.న్యూస్‌: ఉమ్మ‌డి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు (Nadendla Bhaskara Rao) క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా వయో సంబంధిత సమస్యలతో హైద‌రాబాద్‌లోని ఓ ద‌వాఖాన‌లో చికిత్స పొందుతున్న ఆయ‌న బుధ‌వారం ఉద‌యం తుదిశ్వాస విడిచారు. కుటుంబ సభ్యులు, బంధువులు, శ్రేయోభిలాషులు, మిత్రులు మరియు అభిమానులు అంతిమ నివాళులు అర్పించుకోవడానికి వీలుగా, ఆయన పార్థివ దేహాన్ని జూబిలీహిల్స్‌లోని స్వగృహానికి త‌ర‌లించారు. గురువారం సాయంత్రం 4 గంట‌ల‌కు పంజాగుట్ట హిందూ శ్మశానవాటికలో ఆయ‌న అంత్యక్రియలు నిర్వహించ‌నున్న‌ట్లు కుటుంబ స‌భ్యులు తెలిపారు.

1935 జూన్‌ 23న గుంటూరు జిల్లా, మద్రాస్ ప్రెసిడెన్సీ (బ్రిటిష్ ఇండియా)లో నాదెండ్ల భాస్కర్‌రావు జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీలో లా డిగ్రీ పూర్తిచేశారు. 1978లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి తొలిసారి ఎన్నికయ్యారు. చెన్నారెడ్డి హయాంలో మంత్రిగా పని చేశారు. తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌స్థాకుల్లో ఒక‌రు. ఎన్టీఆర్ ముఖ్య‌మంత్రి అయిన త‌ర్వాత ఆయ‌న కేబినెట్‌లో ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. అయితే 1984లో ఎన్టీఆర్ అమెరికాలో చికిత్స పొందుతున్న స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీ మ‌ద్ద‌తుతో తిరుగుబాటు చేసి.. ముఖ్య‌మంత్రి అయ్యారు. ఎన్టీఆర్ మ‌ళ్లీ అధికారాన్ని చేజిక్కించుకోవ‌డంతో.. ఆంధ్రప్రదేశ్‌ 11వ సీఎంగా 31 రోజుల‌పాటే పని చేశారు. అనంత‌రం టీడీపీ నుంచి బ‌హిష్క‌రించ‌డంతో కాంగ్రెస్‌లో చేరారు. 12వ లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఖ‌మ్మం ఎంపీగా విజ‌యం సాధించారు. 2019లో బీజేపీ కండువా క‌ప్పుకున్నారు.

 

Advertisement
Advertisement