త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mallojula Venugopala Rao | సొంతింటికి చేరిన మల్లోజుల.. 45 ఏళ్ల తర్వాత పెద్ద‌ప‌ల్లికి

Mallojula Venugopala Rao | మావోయిస్టు కేంద్ర క‌మిటీ స‌భ్యులు మ‌ల్లోజుల వేణుగోపాల రావు గ‌తేడాది అక్టోబ‌ర్ 15వ తేదీన‌ మ‌హారాష్ట్ర సీఎం ఫ‌డ్న‌వీస్ ఎదుట లొంగిపోయిన విష‌యం విదిత‌మే. నాటి నుంచి నిన్న‌టి వ‌ర‌కు మ‌హారాష్ట్ర‌లోనే ఆశ్ర‌యం పొందిన మ‌ల్లోజుల దాదాపు ఐదు నెల‌ల త‌ర్వాత త‌న సొంతూరుకు చేరుకున్నారు.

S

Telangana | Published On Mar 1, 2026, 4.30 pm IST

Mallojula Venugopala Rao | సొంతింటికి చేరిన మల్లోజుల.. 45 ఏళ్ల తర్వాత పెద్ద‌ప‌ల్లికి
Advertisement

కుటుంబ సభ్యుల ఆప్యాయ పలకరింపులు

Mallojula Venugopala Rao | త్రినేత్ర‌.న్యూస్ : మావోయిస్టు కేంద్ర క‌మిటీ స‌భ్యులు మ‌ల్లోజుల వేణుగోపాల రావు గ‌తేడాది అక్టోబ‌ర్ 15వ తేదీన‌ మ‌హారాష్ట్ర సీఎం ఫ‌డ్న‌వీస్ ఎదుట లొంగిపోయిన విష‌యం విదిత‌మే. నాటి నుంచి నిన్న‌టి వ‌ర‌కు మ‌హారాష్ట్ర‌లోనే ఆశ్ర‌యం పొందిన మ‌ల్లోజుల దాదాపు ఐదు నెల‌ల త‌ర్వాత త‌న సొంతూరుకు చేరుకున్నారు. 45 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం సొంతింటికి చేరుకున్న మ‌ల్లోజుల వేణుగోపాల‌రావుకు కుటుంబ స‌భ్యులు ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు.

ఆదివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని తన ఇంటికి మల్లోజుల భార్య తారతో కలిసి వచ్చారు. సోదరుడు అంజయ్యతో పాటు కుటుంబ సభ్యులు మల్లోజులను ఆప్యాయంగా పలకరించి ఆలింగనం చేసుకొని యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. 1980లో సొంతూరిని, కుటుంబ సభ్యులను విడిచి ఉద్యమ బాట ఎంచుకుని మల్లోజుల వేణుగోపాల‌ రావు అడవి బాట పట్టాడు. ఉద్యమ ప్రస్థానంలో అంచలంచెలుగా కేంద్ర కమిటీ స్థాయి వరకు ఎదిగారు. ఇటీవల మల్లోజుల లొంగిపోయిన సంగతి విదితమే. సుదీర్ఘ విరామం అనంతరం మ‌ల్లోజుల స్వగ్రామానికి రావడం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో చర్చనీయాంశమైంది.

Advertisement
Advertisement