త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bhatti Vikramarka | మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌ను గెలిపించండి: డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌

Bhatti Vikramarka | మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో (Municipal Elections) కాంగ్రెస్ (Congress) పార్టీని గెలిపించాల‌ని ఉప‌ముఖ్య‌మంత్రి (Deputy CM) మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క (Bhatti Vikramarka) పిలుపునిచ్చారు. రెండేళ్లుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ప‌ట్ట‌ణాభివృద్ధి కోసం అనేక చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని చెప్పారు.

A

Telangana | Published On Jan 27, 2026, 2.40 pm IST

Bhatti Vikramarka | మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌ను గెలిపించండి: డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌
Advertisement

Bhatti Vikramarka | రాబోయే మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో (Municipal Elections) రాష్ట్ర‌వ్యాప్తంగా కాంగ్రెస్ (Congress) పార్టీని గెలిపించాల‌ని రాష్ట్ర ఉప‌ముఖ్య‌మంత్రి (Deputy CM) మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క (Bhatti Vikramarka) ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. గ‌త రెండేళ్లుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ప‌ట్ట‌ణాభివృద్ధి కోసం అనేక చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని చెప్పారు. మ‌ధిర‌లోని క్యాంపు కార్యాల‌యంలో నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశంలో విక్ర‌మార్క మాట్లాడుతూ పేద‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబాల‌కు అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టామ‌ని పేర్కొన్నారు. అర్హ‌త క‌లిగిన పేద‌లందరికీ నూత‌న రేష‌న్ కార్డులు మంజూరు చేశామ‌న్నారు. రేష‌న్ కార్డుదారుల‌కు ఉచితంగా స‌న్న‌బియ్యం పంపిణీ చేస్తున్నామ‌ని, దాని ద్వారా మూడు లక్ష‌ల కుటుంబాలు ల‌బ్ధి పొందుతున్నారని వివ‌రించారు. అల్పాదాయ వ‌ర్గాల‌కు విద్యుత్ 200 యూనిట్ల‌కు త‌క్కువ వినియోగిస్తే ఉచిత విద్యుత్ అంద‌జేస్తున్నామ‌ని పేర్కొన్నారు. రాష్ట్రంలోని మ‌హిళ‌ల‌కు ఆర్టీసీ బ‌స్సులో ఉచిత ప్ర‌యాణ సౌక‌ర్యం క‌ల్పిస్తున్నామ‌ని చెప్పారు.

విద్యార్థుల‌కు నైపుణ్యాభివృద్ధి కోసం ఏటీసీల‌ను ఏర్పాటు చేశామ‌ని, వీటిద్వారా భ‌విష్య‌త్‌లో పెద్ద ఎత్తున ఉపాధి అవ‌కాశాలు క‌ల్పిస్తామ‌న్నారు. రాష్ట్ర‌వ్యాప్తంగా యంగ్ ఇండియా రెసిడెన్షియ‌ల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామ‌న్నా ఆయ‌న‌.. మ‌హిళా సంఘాల స‌భ్యుల‌కు వ‌డ్డీలేని రుణాలు రూ.ఆరువేల కోట్లు ఇచ్చామ‌ని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి క‌లుపుతూ.. ప‌రిశ్ర‌మ‌లు, మౌళిక వ‌స‌తులు, విద్య‌, వైద్యంపై దృష్టిసారించి ముందుకు పోతున్నామ‌ని వివ‌రించారు. రాష్ట్రాన్ని ప్ర‌ణాళిక బ‌ద్ధంగా అభివృద్ధి చేసేందుకు కోర్‌, ప్యూర్‌, రేర్ మూడు ద‌శ‌లుగా విభ‌జించామ‌ని చెప్పారు. ఆయా ప్రాంతాల్లో అవ‌స‌రానికి త‌గ్గ రంగానికి సంబంధించిన ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు పేర్కొన్నారు.

విజ‌న్ 2047 డాక్యుమెంట్‌ను విడుద‌ల చేశామ‌ని, ఆ డాక్యుమెంట్‌లోని అభివృద్ధిని సాధించేందుకు ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ముందుకు పోతున్నామ‌న్నారు. వీట‌న్నింటినీ ముందుకు తీసుకెళ్లాలంటే మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాల‌ని కోరారు. ఈ ఎన్నిక‌ల నేప‌థ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నాయ‌కుల‌ను స‌మ‌న్వయం చేసుకుని ప్ర‌భుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్ర‌జ‌ల‌కు వివ‌రించాలని సూచించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement