త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mahesh Kumar Goud | డ్ర‌గ్ టెస్టుల‌కు కేటీఆర్ సిద్ధం కావాలి : టీపీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్‌

P

Telangana | Published On Mar 15, 2026, 4.05 pm IST

Mahesh Kumar Goud | డ్ర‌గ్ టెస్టుల‌కు కేటీఆర్ సిద్ధం కావాలి : టీపీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్‌
Advertisement

Mahesh Kumar Goud | రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ అజీజ్‌న‌గ‌ర్‌లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫాంహౌస్‌లో డ్ర‌గ్స్ పార్టీ జ‌రుగ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇందులో ప‌లువురు తెలుగు రాష్ట్రాల‌కు చెందిన ప్ర‌జాప్ర‌తినిధుల‌తో పాటు మొత్తం 11 మంది పోలీసుల‌కు చిక్క‌డం సంచ‌ల‌నం సృష్టించింది. డ్ర‌గ్స్ పార్టీపై పీసీసీ అధ్య‌క్షుడు, ఎమ్మెల్సీ మ‌హేశ్ కుమార్ గౌడ్ ఘాటుగా స్పందించారు. ఈ మేర‌కు ఆయ‌న ఆదివారం మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. డ్ర‌గ్స్ కేసుపై కేటీఆర్ స‌మాధానం చెప్పాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ఈగ‌ల్ టీమ్ త‌న క‌ర్త‌వ్యాన్ని నెర‌వేర్చింద‌న్నారు. ఇందులో ఎలాంటి రాజ‌కీయాలు లేవ‌ని, రాజకీయాలకు అతీతంగా ప‌ని చేస్తోంద‌న్నారు.

ప్రజలు, డ్రగ్స్ రహిత సమాజం కోసం ఈగల్ టీమ్ దాడులు జ‌రుపుతోంద‌న్నారు. కేటీఆర్‌తో పాటు ఆయ‌న అనుచ‌రులు డ్ర‌గ్స్ తీసుకుంటున్న‌ట్లుగా అనుమానాలు ఉన్నాయ‌న్నారు. అవ‌స‌ర‌మైతే కేటీఆర్ సైతం డ్ర‌గ్స్ టెస్టుల‌కు సిద్ధం కావాల‌ని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా డ్ర‌గ్స్ టెస్టులు చేసుకొని లోప‌లికి వెళ్దామ‌న్నారు. డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం సీఎం రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నార‌న్న ఆయ‌న‌.. ఆ ప్రయత్నానికి మ‌న‌వ‌తు సాయం చేయాల‌ని పిలుపునిచ్చారు. పోరాటాన్ని నిర్వీర్యం చేసే ప్ర‌య‌త్నం చేయొద్ద‌ని సూచించారు. అయితే, గాంధీభవన్‌ వద్ద కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ ఆధ్వర్యంలో కార్యకర్తలు, నేతలు నిర‌స‌న చేప‌ట్టి.. నో డ్రగ్స్‌.. సేవ్‌ తెలంగాణ అంటూ నిన‌దించారు.

Advertisement
Advertisement