త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Madhusudana Chari | స్వాతంత్య్రం వ‌చ్చి ఇన్నేండ్ల‌యినా.. ఇండ్లు లేని నిరుపేద‌లు ఇంకా ఉన్నారంటే కార‌ణ‌మెవ‌రు?: ఎమ్మెల్సీ మ‌ధుసూద‌నా చారి

Madhusudana Chari | దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చి ఇన్నేండ్ల‌యినా ఇండ్లు లేని నిరుపేద‌లు ఉన్నారంటే దానికి కార‌ణ‌మెవ‌ర‌ని మండ‌లిలో బీఆర్ఎస్ ఎల్పీ నేత మ‌ధుసూద‌నా చారి (Madhusudana Chari) ప్ర‌శ్నించారు. అభ‌య‌హ‌స్తం ఇండ్ల ల‌బ్ధిదారుల ఎంపిక‌లో పార‌ద‌ర్శ‌క‌త ఉండ‌టం లేద‌ని విమ‌ర్శించారు.

G

Telangana | Published On Mar 18, 2026, 11.58 am IST

Madhusudana Chari | స్వాతంత్య్రం వ‌చ్చి ఇన్నేండ్ల‌యినా.. ఇండ్లు లేని నిరుపేద‌లు ఇంకా ఉన్నారంటే కార‌ణ‌మెవ‌రు?: ఎమ్మెల్సీ మ‌ధుసూద‌నా చారి
Advertisement

Madhusudana Chari | త్రినేత్ర‌.న్యూస్‌: దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చి ఇన్నేండ్ల‌యినా ఇండ్లు లేని నిరుపేద‌లు ఉన్నారంటే దానికి కార‌ణ‌మెవ‌ర‌ని మండ‌లిలో బీఆర్ఎస్ ఎల్పీ నేత మ‌ధుసూద‌నా చారి (Madhusudana Chari) ప్ర‌శ్నించారు. అభ‌య‌హ‌స్తం ఇండ్ల ల‌బ్ధిదారుల ఎంపిక‌లో పార‌ద‌ర్శ‌క‌త ఉండ‌టం లేద‌ని విమ‌ర్శించారు. తెలంగాణ‌ను గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతామ‌న్నార‌ని, కానీ ఆచ‌ర‌ణ మాత్రం ఆవిధంగా లేద‌ని మండిప‌డ్డారు. శాస‌న‌మండ‌లిలో ప్ర‌శ్నోత్త‌రాల్లో భాగంగా ఇండ్ల నిర్మాణంపై మ‌ధుసూద‌నా చారి ప్ర‌శ్నించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. `ఏడాదికి 4.5 ల‌క్ష ఇండ్లు ఇస్తామ‌న్న‌రు. గ‌తంలో బీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఇండ్ల‌కు పెండింగ్ బిల్లుల‌న్నిటిని ర‌ద్దు చేసింది. దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు ఇండ్లు లేని నిరుపేద‌లు ఉన్నారంటే దానికి కార‌ణ‌మెరో ఆలోచించాలి.

పేద ప్ర‌జ‌లు కేంద్ర బిందువుగా సాగేకార్య‌క్ర‌మాన్ని స్వాగ‌తిద్దాం. తెలంగాణను గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతామ‌ని, ఐదేండ్ల‌లో ప్ర‌తి కుటుంబానికి ప‌క్కా ఇంటిని నిర్మించి ఇస్తామ‌న్న‌రు. కానీ, ఈ ప్ర‌క‌ట‌న‌కు, ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన నిర్మాణాల‌కు గానీ, మంత్రి చెబుతున్న జ‌వాబుకు మ‌ధ్య గ్యాప్ ఉన్న‌ది. ఇండ్ల కేటాయింపుల్లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రుగుతున్నాయి. ల‌బ్దిదారుల ఎంపిక‌లో పార‌ద‌ర్శ‌కత లేదు. అర్హుల‌కు అన్యాయం జ‌రుగుతున్న‌ద‌ని ప్ర‌జ‌లు క‌లెక్ట‌రేట్ల వ‌ద్ద‌ ధ‌ర్నాలు, నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు. అందువ‌ల్ల ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీ మేర‌కు పేద‌ల‌కు ఇండ్లు ఇవ్వాలి` అని కోరారు.

Advertisement

తాజావార్తలు

Advertisement