త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Land Value | ఈ నెల 28 నుంచి పెరగ‌నున్న భూముల మార్కెట్‌ విలువ‌..

Land Value | రాష్ట్రంలో భూముల విలువ (Land Value) పెరుగ‌నుంది. ఈ నెల 28 నుంచి రాష్ట్ర‌వ్యాప్తంగా వ్యవసాయ భూములు, అపార్టుమెంట్లు, వాణిజ్య స్థలాల ప్రభుత్వ మార్కెట్ విలువను స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సవరణ చేయనుంది.

G

Telangana | Published On May 19, 2026, 9.34 am IST

Land Value | ఈ నెల 28 నుంచి పెరగ‌నున్న భూముల మార్కెట్‌ విలువ‌..
Advertisement

Land Value | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలో భూముల విలువ (Land Value) పెరుగ‌నుంది. ఈ నెల 28 నుంచి రాష్ట్ర‌వ్యాప్తంగా వ్యవసాయ భూములు, అపార్టుమెంట్లు, వాణిజ్య స్థలాల ప్రభుత్వ మార్కెట్ విలువను స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సవరణ చేయనుంది. దీనికి సంబంధించి ప్ర‌భుత్వం ఇప్ప‌టికే క‌స‌ర‌త్తు పూర్తి చేసింది. కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత భూముల విలువను స‌వ‌రించ‌డం ఇదే తొలిసారి. రాష్ట్రంలో చివ‌రిసారిగా 2022లో భూముల మార్కెట్ విలువ పెరిగింది.

ప్రభుత్వానికి ఆదాయం.. ప్ర‌జ‌ల‌కు భారం

వ్యవసాయ భూముల మార్కెట్ విలువ గరిష్టంగా రెండు నుంచి మూడు రెట్లు పెరగనున్న‌ట్లు స‌మాచారం. అంటే ప్రస్తుతం ఎకరాకు రూ.6 లక్షలుగా ఉన్న విలువ రూ.12 లక్షల నుంచి రూ. 8 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా హైద‌రాబాద్ న‌గ‌ర‌ శివార్లలోని కోర్ అర్బన్ ప్రాంతాల్లో మార్కెట్ విలువ బహిరంగ మార్కెట్ రేట్ల కంటే చాలా తక్కువగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఎకరా విలువ ప్రభుత్వ లెక్కల్లో రూ.20 లక్షలు ఉంటే.. బయట రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్లు పలుకుతున్న‌ది. ఇలాంటి చోట్ల మార్కెట్ విలువను ఏకంగా 300 శాతానికి పైగా పెంచి అసమానతలను తగ్గించాలని సర్కార్ భావిస్తున్న‌ది. అయితే రిజిస్ట్రేషన్‌ చార్జీల పెంపుతో ప్రభుత్వానికి ఆదాయం సమకూరనుండగా, ఆస్తుల కొనుగోలుదారులపై భారం పడనుంది.

విడతల వారీగా..!

ఈ నేప‌థ్యంలో ఒకేసారి కాకుండా విడతల వారీగా పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన‌ట్లు తెలిసింది. మార్కెట్‌ విలువ ఒకేసారి పెంచినా, స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ చార్జీలను మూడు విడతల్లో పెంచనున్నట్టు సమాచారం. దీంతో ఆదాయం సమకూరడంతో పాటు ప్రజలపై ఒకేసారి భారం పడకుండా ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నది. గ‌త‌ ఆర్థిక సంవత్సరం ముగియ‌క‌ ముందే భూముల విలువలు పెరుగుతాయని అంతా భావించారు.

Advertisement
Advertisement