త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | మార్కెట్ యార్డుల‌ను సంద‌ర్శించిన కేటీఆర్‌.. గోడు వెల్ల‌బోసుకున్న రైతులు

KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ‌రంగ‌ల్ జిల్లా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా మంగ‌ళ‌వారం సాయంత్రం నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డును సందర్శించారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డులోని పరిస్థితులను ఆయన పరిశీలించారు.

P

Telangana | Published On May 5, 2026, 7.45 pm IST

KTR | మార్కెట్ యార్డుల‌ను సంద‌ర్శించిన కేటీఆర్‌.. గోడు వెల్ల‌బోసుకున్న రైతులు
Advertisement

KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ‌రంగ‌ల్ జిల్లా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా మంగ‌ళ‌వారం సాయంత్రం నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డును సందర్శించారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డులోని పరిస్థితులను ఆయన పరిశీలించారు. రైతులు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎదుర్కొంటున్న సమస్యలను కేటీఆర్‌కు వివరించారు. ధాన్యం కొనుగోళ్లు, మార్కెట్ సదుపాయాలు, చెల్లింపుల ఆలస్యం వంటి అంశాలపై తమ ఇబ్బందులను రైతులు వివ‌రించారు. అలాగే, ప‌ర‌కాల పరకాల నియోజకవర్గం, గీసుగొండ ఊకల్ సొసైటీలోని మక్కల కొనుగోలు కేంద్రంలో రైతులు కేటీఆర్‌కు స‌మ‌స్య‌ను విన్న వించారు.

కష్టపడి పండించిన పంటను కొనాలని మార్క్‌ఫెడ్ అధికారులకు, కలెక్టర్‌కు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదని రైతులు ఈ సంద‌ర్భంగా పోయారు. మక్కల కొనుగోళ్లలో జరుగుతున్న నిర్లక్ష్యంపై మార్క్‌ఫెడ్ ఎండీ శ్రీనివాస్ రెడ్డికి కేటీఆర్ ఫోన్ చేసి మాట్లాడారు. జాప్యంపై నిల‌దీశారు. మార్క్‌ఫెడ్ ఎండీ శ్రీనివాస్ రెడ్డితో మాట్లాడి పంట కొనుగోళ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని, మార్క్‌ఫెడ్ వైఫల్యాన్ని నిల‌ద‌శారు. కేటీఆర్ రైతన్నలు పండించిన పంట కొనేది ఉందా లేదా అంటూ ప్ర‌శ్నించారు. కేటీఆర్ వెంట బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోతు కవిత, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement