KRMB | కేఆర్ఎంబీ కీలక నిర్ణయం.. తెలంగాణకు 16, ఏపీకి 10 టీఎంసీల నీరు విడుదల..!
KRMB | తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల తాగునీటి అవసరాల మేరకు నీటిని విడుదల చేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలకు కేఆర్ఎంబీ అంగీకారం తెలిపింది.
KRMB | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల తాగునీటి అవసరాల మేరకు నీటిని విడుదల చేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలకు కేఆర్ఎంబీ అంగీకారం తెలిపింది.
నాగార్జున సాగర్ నుంచి ఏపీకి 10 టీఎంసీలు, తెలంగాణకు 16 టీఎంసీలు కేటాయించారు. శ్రీశైలం నుంచి తెలంగాణకు 5 టీఎంసీల నీటి విడుదలకు కేఆర్ఎంబీ అనుమతి ఇచ్చింది. ఈ ఒప్పందం మంగళవారం నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు అమలు కానుంది.
ఏపీ ఇప్పటికే ఎక్కువ నీరు వాడుకుందని సమావేశంలో తెలంగాణ ఇంజినీర్లు తెలిపారు. సాగర్లో ఏపీకి 10 టీఎంసీలు పోగా మిగిలిన మొత్తం నీరు తమకే చెందుతుందని తెలిపింది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ నెల 14న మరోసారి సమావేశం
త్రిసభ్య కమిటీ సమావేశం సాఫీగా సాగిందని ఏపీ ఈఎన్సీ నరసింహమూర్తి తెలిపారు. ఆగస్టు 15 వరకు ఏపీ నీటి అవసరాల కోసం 10 టీఎంసీలు, తెలంగాణకు శ్రీశైలం నుంచి 5, సాగర్ నుంచి 16 టీఎంసీలు వినియోగించుకోవచ్చని ఏపీ ఈఎన్సీ ప్రకటించింది. ఈ నెల 14న జరిగే బోర్డు సమావేశంలో మిగిలిన అంశాలపై చర్చిస్తామని పేర్కొంది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల తాగునీటి అవసరాలపై చర్చించి నిర్ణయం తీసుకునేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ ఇవాళ సమావేశమైంది. హైదరాబాద్లోని జలసౌధ వేదికగా కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి సతీష్ కాంబోజ్, తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ రమేశ్ బాబు, ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీ నర్సింహమూర్తి సమావేశమయ్యారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



