Kishan Reddy | ప్రజాస్వామ్యాన్ని అణచివేయాలని చూస్తే.. ప్రజలే తగిన సమాధానమిస్తారు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
Kishan Reddy | ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన ప్రభుత్వమే స్వయంగా దానిని ఖూనీ చేస్తున్నదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయన్నారు.
Kishan Reddy | త్రినేత్ర.న్యూస్: ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన ప్రభుత్వమే స్వయంగా దానిని ఖూనీ చేస్తున్నదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. కామారెడ్డి (Kamareddy) బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిపై (MLA Venkata Ramana Reddy) నిరాధార ఆరోపణలు చేసి, ఆయన వాటిని నిరూపించాలని సవాల్ చేసిన వెంటనే హౌజ్ అరెస్టుకు పాల్పడటం ముమ్మాటికీ కక్షసాధింపేనని చెప్పారు. అనవసర ఆరోపణలు చేయడం, వాటికి సమాధానం ఇవ్వమంటే అధికారాన్ని దుర్వినియోగం చేసి అరెస్టులకు దిగడం దౌర్భాగ్యకరమని మండిపడ్డారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం గేటును కాంగ్రెస్ (Congress) నాయకులు తమ కారుతో గుద్ది ధ్వంసం చేయడం రాష్ట్రంలో శాంతిభద్రతల వైఫల్యానికి ఉదాహరణ అని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.
ఎమ్మెల్యేకు సంఘీభావంగా కామారెడ్డికి వెళ్లేందుకు సిద్ధమైన బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టు చేయడం తెలంగాణలో అప్రకటిత అత్యవసర పరిస్థితిని తలపిస్తోందని చెప్పారు. ఇది ప్రజాస్వామ్య హక్కులపై బహిరంగ దాడియేనని వెల్లడించారు. రాజకీయంగా రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను చూసి భయపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. అధికారాన్ని ప్రతీకార రాజకీయాలకు వాడుకుంటున్నదని విమర్శించారు. ప్రజలు ఇస్తున్న తీర్పును జీర్ణించుకోలేక ప్రతిపక్షాల గొంతును అణచివేయాలని కుట్రలు చేస్తున్నదని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో రాజకీయంగా విభేదాలు సహజమని, కానీ విపక్షాల గొంతు నొక్కేయడం కాంగ్రెస్ ప్రభుత్వంలో నెలకొన్న అసహనానికి నిదర్శనమని ధ్వజమెత్తారు.
చట్టం అందరికీ సమానంగా ఉండాలని చెప్పారు. రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని పోలీసు యంత్రాంగాన్ని, అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ.. భయపెట్టాలనుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని చెప్పారు. మీ తాటాకు చప్పుళ్లకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు భయపడే ప్రసక్తే లేదన్నారు. ఈ అరెస్టులు, బెదిరింపులతో తమను అడ్డుకోవాలన్న భ్రమల్లో నుంచి బయటకు రావాలని చెప్పారు. ప్రజా సమస్యలపై తమ స్వరాన్ని మరింత బలంగా వినిపిస్తామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రాజకీయ అరెస్టులను నిలిపివేసి, ప్రజాస్వామ్య హక్కులను గౌరవించాలని డిమాండ్ చేశారు. లేకపోతే తెలంగాణ ప్రజలే ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు ముందుకు వస్తారన్నారు. ప్రజాస్వామ్యాన్ని అణచివేయాలనే ప్రతి ప్రయత్నానికి ప్రజలే తగిన సమాధానం ఇస్తారని చెప్పారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



