త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kavitha | మిలియన్ మార్చ్‌ను తలపించేలా భూ పోరాటం : క‌విత‌

Kavitha | మిలియన్ మార్చ్‌ను తలపించేలా భూ పోరాటం చేస్తామ‌ని టీఆర్ఎస్ నాయ‌కురాలు క‌విత ప్ర‌క‌టించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించారు.

P

Telangana | Published On Jun 2, 2026, 7.40 pm IST

Kavitha | మిలియన్ మార్చ్‌ను తలపించేలా భూ పోరాటం : క‌విత‌
Advertisement

Kavitha | మిలియన్ మార్చ్‌ను తలపించేలా భూ పోరాటం చేస్తామ‌ని టీఆర్ఎస్ నాయ‌కురాలు క‌విత ప్ర‌క‌టించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంత‌రం క‌విత మాట్లాడుతూ ఈ సందర్భంగా ఆమె తెలంగాణ ఉద్యమ చరిత్రను, అమరవీరుల త్యాగాలను, ఉద్యమకారుల సమస్యలను, అలాగే భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను ప్రస్తావించారు. తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగాలు చేసిన వారిని స్మరించుకుంటూ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఉద్యమాన్ని మరో స్వాతంత్ర పోరాటంతో పోల్చుతూ, ఆస్తులు, ఉద్యోగాలు కోల్పోయినప్పటికీ పోరాటాన్ని కొనసాగించిన ఉద్యమకారులకు అభినందనలు తెలిపారు. ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలపై స్పష్టమైన ప్రకటన చేయకపోవడాన్ని ఆమె విమర్శించారు. హామీల అమలులో జాప్యం దురదృష్టకరమని పేర్కొంటూ ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు.

ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహ ఏర్పాటు అంశాన్ని ప్రస్తావిస్తూ, రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఆయన విగ్రహం తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంత పునాదులు వేసిన ప్రొఫెస‌ర్ కే జ‌య‌శంక‌ర్ సేవలను గుర్తుచేసుకోవాల్సిన అవసరాన్ని ఆమె నొక్కి చెప్పారు. విగ్రహ ఏర్పాటులో జాప్యాన్ని తప్పుబడుతూ, 12 ఏళ్లు గడిచినా సరైన గౌరవం ఇవ్వకపోవడం అన్యాయమని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో గతంలో చేసిన ప్రయత్నాలను ఆమె వివరించారు. 2014 నుంచి విగ్రహ ఏర్పాటుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని, 2017లో అప్పటి మున్సిపల్ శాఖకు కూడా లేఖ రాసినప్పటికీ స్పందన రాలేదని పేర్కొన్నారు. తాజాగా మరోసారి ముఖ్యమంత్రికి లేఖ రాసినట్లు తెలిపారు. విగ్రహ ఏర్పాటుకు అవసరమైన ఖర్చు మరియు నిర్వహణ బాధ్యతను తామే తీసుకుంటామని కూడా వెల్లడించారు.

ఆగస్ట్ 6న ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ఉన్న నేపథ్యంలో ఆ తేదీ లోగా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయంపై మున్సిపల్ శాఖ అధికారులు తక్షణమే చర్యలు తీసుకుని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. జూన్ 2 ఆవిర్భావ దినోత్సవం కేవలం సెలవు రోజు కాదని, తెలంగాణ ప్రజల గుర్తింపు, భాషా స్వేచ్ఛ, సామాజిక గౌరవాన్ని ప్రతిబింబించే రోజు అని ఆమె పేర్కొన్నారు. ఈ చరిత్రను కొత్త తరాలకు విస్తృతంగా చేరవేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రభుత్వ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, జూన్ 2 వేడుకల్లో ఉద్యమకారుల సమస్యలపై స్పష్టత రావాల్సిందని, కానీ ఆ దిశలో ప్రకటనలు రాలేదని తెలిపారు. దీనికి నిరసనగా భవిష్యత్‌లో పెద్ద ఎత్తున భూపోరాటం చేపడతామని హెచ్చరించారు.

ఈ మేరకు జులై 2న ఉప్పల్ భగాయత్‌లో భారీ స్థాయిలో భూపోరాట కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. కార్యక్రమానికి రాజకీయాలకు అతీతంగా మేధావులు, ఉద్యోగులు, విద్యార్థులు, న్యాయవాదులు, మీడియా ప్రతినిధులు సహా అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలకు న్యాయం చేయడం, అమరవీరుల త్యాగాలకు గౌరవం ఇవ్వడం తమ బాధ్యత అని ఆమె పేర్కొన్నారు. భవిష్యత్‌లో ఉద్యమకారులను రాష్ట్ర అభివృద్ధి ప్రక్రియలో భాగస్వామ్యం చేస్తామని తెలిపారు.

Advertisement

తాజావార్తలు

Advertisement