Uttam Kumar Reddy | పాలమూరులో నీటిపారుదలపై సీఎం రేవంత్ ఫోకస్.. రెండు రోజుల పర్యటనలో ప్రాజెక్టుల తనిఖీ..!
Uttam Kumar Reddy | ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని కీలక నీటిపారుదల ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలో రెండు రోజుల పాటు పాలమూరు ప్రాంతంలో విస్తృత పర్యటన చేపట్టి వివిధ సాగునీటి ప్రాజెక్టులను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు.
Uttam Kumar Reddy | ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని కీలక నీటిపారుదల ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలో రెండు రోజుల పాటు పాలమూరు ప్రాంతంలో విస్తృత పర్యటన చేపట్టి వివిధ సాగునీటి ప్రాజెక్టులను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. ఈ పర్యటన పాలమూరు ప్రాంత భవిష్యత్ నీటిపారుదల అభివృద్ధికి దిశానిర్దేశం చేసే చారిత్రాత్మక ఘట్టంగా నిలుస్తుందని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్లోని జలసౌధలో సీనియర్ అధికారులతో నిర్వహించిన ఉన్నతస్థాయి సన్నాహక సమావేశానికి మంత్రి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న పలు సాగునీటి ప్రాజెక్టుల పూర్తి దిశగా ఈ పర్యటన కీలక మలుపు తిప్పే అవకాశముందన్నారు. ప్రాజెక్టుల ప్రస్తుత స్థితి, అమలులో ఎదురవుతున్న అడ్డంకులు, అవసరమైన నిధులు, భవిష్యత్ కార్యాచరణపై ముఖ్యమంత్రి సమగ్ర సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.
కరువు బారిన పడిన పాలమూరు ప్రాంతంలో సాగునీటి సామర్థ్యాన్ని గరిష్ఠ స్థాయికి పెంచి లక్షలాది మంది రైతులకు ప్రయోజనం చేకూర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఈ పర్యటన అనంతరం కీలక విధాన నిర్ణయాలు, కొత్త మంజూరులు, భారీ నిధుల విడుదలకు అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పర్యటనలో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, కోయిల్సాగర్, భీమా, నెట్టంపాడు తదితర ప్రధాన ప్రాజెక్టులపై సవివర ప్రజెంటేషన్లు నిర్వహించనున్నారు. కొనసాగుతున్న పనులు, మిగిలి ఉన్న నిర్మాణాలు, భవిష్యత్ విస్తరణ ప్రణాళికలపై అధికారులు నివేదికలు సమర్పించనున్నారు. జూన్ 4 సాయంత్రం సోమశిలలో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించే ప్రతిపాదన ఉంది. ఈ సమావేశంలో సీనియర్ ఇంజనీర్లు వివిధ ప్రాజెక్టుల పురోగతి, సవాళ్లు, పూర్తి చేయాల్సిన పనులు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలను ముఖ్యమంత్రికి వివరించనున్నారు.
ఈ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి సహా పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉంది. పర్యటన సందర్భంగా వైమానిక తనిఖీల కోసం రెండు హెలికాప్టర్లను వినియోగించనున్నారు. దీంతో ప్రాంతవ్యాప్తంగా ఉన్న నీటిపారుదల మౌలిక సదుపాయాలు, ప్రాజెక్టు ప్రాంతాలపై విస్తృత స్థాయిలో పరిశీలన చేపట్టనున్నారు. నిధుల అవసరాలు, ప్రాజెక్టుల పూర్తి గడువులు, అమలును వేగవంతం చేసే చర్యలపై అక్కడికక్కడే నిర్ణయాలు తీసుకునే అవకాశముందని మంత్రి తెలిపారు. పాలమూరులో ఆచరణ సాధ్యమైన ప్రతి సాగునీటి ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేసి, సాగునీటి విస్తరణ లక్ష్యాలను సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. పాలమూరు ప్రాంత భవిష్యత్ నీటిపారుదల రోడ్మ్యాప్ రూపకల్పనలో ఈ పర్యటన కీలక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●నీటిలో అలజడి రేపి చేపలు పట్టడం - Stir up waters to catch fish
- ●Buchi Babu Sana | పెద్ది ఎన్టీఆర్ కోసం రాసిన కథ కాదు...చిరంజీవి తిడతారనుకున్నా - పెద్దిపై బుచ్చిబాబు సానా కామెంట్స్
- ●Nepal PM Balen Shah | 'మేమూ ఇండియాలోకి చొరబడ్డాం'.. నేపాల్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు.. భగ్గుమన్న విపక్షాలు, విద్యార్థులు
- ●Kajal Aggarwal | కాజల్ అగర్వాల్ హాట్ ఫొటోషూట్ - ఆఫర్ల కోసమేనా?
- ●Kavitha | మిలియన్ మార్చ్ను తలపించేలా భూ పోరాటం : కవిత
- ●Ponnam Prabhakar | తెలంగాణ మా అయ్య జాగీరే.. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు పొన్నం కౌంటర్..!

నీటిలో అలజడి రేపి చేపలు పట్టడం - Stir up waters to catch fish

Buchi Babu Sana | పెద్ది ఎన్టీఆర్ కోసం రాసిన కథ కాదు...చిరంజీవి తిడతారనుకున్నా - పెద్దిపై బుచ్చిబాబు సానా కామెంట్స్

Nepal PM Balen Shah | 'మేమూ ఇండియాలోకి చొరబడ్డాం'.. నేపాల్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు.. భగ్గుమన్న విపక్షాలు, విద్యార్థులు

Kajal Aggarwal | కాజల్ అగర్వాల్ హాట్ ఫొటోషూట్ - ఆఫర్ల కోసమేనా?





