త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kavitha | కొత్త పార్టీ వేళ.. గ‌న్‌పార్క్‌లో అమ‌ర వీరుల‌కు నివాళుల‌ర్పించిన కవిత

Kavitha | మ‌రికాసేప‌ట్లో తెలంగాణ‌లో మ‌రో కొత్త రాజ‌కీయ పార్టీ ఆవిర్భ‌వించ‌నుంది. తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత (Kavitha) నూత‌న పార్టీని ప్ర‌క‌టించ‌నున్నారు.

G

Telangana | Published On Apr 25, 2026, 9.18 am IST

Kavitha | కొత్త పార్టీ వేళ.. గ‌న్‌పార్క్‌లో అమ‌ర వీరుల‌కు నివాళుల‌ర్పించిన కవిత
Advertisement

Kavitha | త్రినేత్ర‌.న్యూస్‌: మ‌రికాసేప‌ట్లో తెలంగాణ‌లో మ‌రో కొత్త రాజ‌కీయ పార్టీ ఆవిర్భ‌వించ‌నుంది. తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత (Kavitha) నూత‌న పార్టీని ప్ర‌క‌టించ‌నున్నారు. మేడ్చ‌ల్ జిల్లా మునీరాబాద్‌లోని అధ్వ‌య ఫంక్ష‌న్ హాల్‌లో పార్టీ పేరును ప్ర‌క‌టించ‌డంతోపాటు జండాను ఆవిష్క‌రించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో అసెంబ్లీ ఎదురుగా ఉన్న గ‌న్‌పార్క్‌లో (Gun park) అమ‌ర‌వీరుల‌కు నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ‌లో కొత్త విప్ల‌వం రానుంద‌ని, త‌న‌ను ప్ర‌జ‌లు ఆశీర్వ‌దించాల‌న్నారు.

అంత‌కుముందు బంజారాహిల్స్‌లోని తన నివాసంలో కవిత దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. వేద‌పండితు ఆశీర్వాదం తీసుకున్నారు. స‌ర్వ‌మ‌త ప్రార్థ‌న‌ల అనంత‌రం భ‌ర్త‌, కుటుంబ స‌భ్యుల ఆశీర్వాదం తీసుకున్నారు. అనంత‌రం గన్ పార్క్‌కు చేరుకున్నారు. అమ‌రుల‌కు నివాళులు అర్పించిన త‌ర్వాత మునీరాబాద్ బ‌య‌ల్దేరారు. ఉద‌యం 10 గంట‌ల‌కు పార్టీ ప్రకటన, జెండా ఆవిష్కరించ‌నున్నారు. స‌భ అనంతరం ర్యాలీగా లిబర్టీ చౌరస్తాకు వ‌స్తారు. అక్క‌డ అంబేద్కర్‌ విగ్రహానికి నివాళులర్పించి ఇంటికి చేరుకుంటారు.

Advertisement
Advertisement