త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kalvakuntla Kavitha | బీజేపీ ఎంపీలు బానిస‌లు.. అందుకే నోరు మెద‌ప‌డం లేదు : క‌విత‌

Kalvakuntla Kavitha | తెలంగాణ నుంచి గెలుపొందిన 8 మంది బీజేపీ ఎంపీలు ప్ర‌ధాని మోదీకి బానిస‌లుగా మారార‌ని తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత ధ్వ‌జ‌మెత్తారు. రాష్ట్రానికి అన్యాయం జ‌రుగుతున్న‌ప్ప‌టికీ నోరు మెద‌ప‌డం లేద‌ని మండిప‌డ్డారు.

S

Telangana | Published On Apr 25, 2026, 7.15 pm IST

Kalvakuntla Kavitha | బీజేపీ ఎంపీలు బానిస‌లు.. అందుకే నోరు మెద‌ప‌డం లేదు : క‌విత‌
Advertisement

Kalvakuntla Kavitha | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ నుంచి గెలుపొందిన 8 మంది బీజేపీ ఎంపీలు ప్ర‌ధాని మోదీకి బానిస‌లుగా మారార‌ని తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత ధ్వ‌జ‌మెత్తారు. రాష్ట్రానికి అన్యాయం జ‌రుగుతున్న‌ప్ప‌టికీ నోరు మెద‌ప‌డం లేద‌ని మండిప‌డ్డారు. టీఆర్ఎస్ పార్టీ ప్ర‌క‌ట‌న సంద‌ర్భంగా బీజేపీపై క‌విత నిప్పులు చెరిగారు.

బీజేపీ అంటేనే సామాజిక న్యాయానికి బద్ద వ్యతిరేకి. ఆ పార్టీ పెద్దలకు అసలు తెలంగాణ ఏర్పాటే ఇష్టం లేదు. ఒకరు తల్లిని చంపి బిడ్డను వేరు చేశారని అంటే మరొక తలకాయ లేని ఎంపీ తెలంగాణ ఏర్పాటును ఇండియా, పాకిస్తాన్ విభజనతో పోల్చారు. తెలంగాణను అవమానించేలా మాట్లాడిన సరే ఇక్కడి బానిస ఎంపీలు నోరు మెదపటం లేదు. తెలంగాణకు ఒక్క పైసా ఇవ్వకపోయిన సరే ప్రశ్నించటం లేదు.

రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఏడు మండలాలను ఆంధ్రాలో కలిపారు. పోలవరం కారణంగా భద్రాచలం వద్ద ఐదు గ్రామాలు మునిగిపోయే పరిస్థితి ఉంది. ఆ గ్రామాలను తెలంగాణకు తేవాలి. ఈ అంశంపై జాగృతి పోరాటం చేసింది. కేంద్రానికి, ఆంధ్రా ప్రభుత్వానికి లేఖ రాసింది. బీజేపీ ఎంపీలు 8 మంది తెలంగాణ బిడ్డలైతే రాముని గుడి మునిగిపోకుండా ఐదు గ్రామాలను తెలంగాణకు తేవాలి. మొదటి నుంచి కూడా బీజేపీ సామాజిక న్యాయానికి బద్ద వ్యతిరేకి. మహిళ బిల్లును, కుల గణన, బీసీ బిల్లును తొక్కి పెట్టారు. పేదలకు కూడు పెట్టే ఉపాధి హామీ పథకాన్ని కూడా లేకుండా చేశారని క‌విత‌ విమర్శించారు.

Advertisement
Advertisement