త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Adivasi Tourism | ఆదివాసీ టూరిజం ఎక్స్‌పోజ‌ర్ ప్రోగ్రాం.. ఉట్నూరు నుంచి హైద‌రాబాద్‌కు 200 మంది ఆదివాసీ ప‌ర్యాట‌కులు

Adivasi Tourism | ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండ‌లం గోండుగూడెంలో ఆదివాసీ టూరిజం ఎక్స్‌పోజ‌ర్ ప్రోగ్రామ్‌ను (Adivasi Tourism) మంత్రి జూప‌ల్లి కృష్ణారావు (Jupalli Krishna Rao) జెండా ఊపి ప్రారంభించారు. గోండుగూడ నుంచి 200 మంది ఆదివాసీ ప‌ర్యాట‌కులు 5 బ‌స్సుల్లో హైద‌రాబాద్‌కు బ‌య‌ల్దేరారు.

G

Telangana | Published On Apr 22, 2026, 10.29 am IST

Adivasi Tourism | ఆదివాసీ టూరిజం ఎక్స్‌పోజ‌ర్ ప్రోగ్రాం.. ఉట్నూరు నుంచి హైద‌రాబాద్‌కు 200 మంది ఆదివాసీ ప‌ర్యాట‌కులు
Advertisement

Adivasi Tourism | త్రినేత్ర‌.న్యూస్‌: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు (Utnoor) మండ‌లం గోండుగూడెంలో ఆదివాసీ టూరిజం ఎక్స్‌పోజ‌ర్ ప్రోగ్రామ్‌ను (Adivasi Tourism) మంత్రి జూప‌ల్లి కృష్ణారావు (Jupalli Krishna Rao) జెండా ఊపి ప్రారంభించారు. గోండుగూడ నుంచి 200 మంది ఆదివాసీ ప‌ర్యాట‌కులు 5 బ‌స్సుల్లో హైద‌రాబాద్‌కు బ‌య‌ల్దేరారు. మ‌ధ్యాహ్నం ఒంటి గంట‌కు తారామ‌తి బారాద‌రికి చేరుకోనున్నారు.

రెండు రోజులపాటు హైదరాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం, చార్మినార్, గోల్కొండ కోట, తారామతి బరాదరి, లుంబినీ పార్క్, శిల్పారామం వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలను వీరు సందర్శించనున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటీడీఏ పివో యువరాజు మర్మ ట్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ కామ్డే, ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్ ఆత్రం సుగుణ, కాంగ్రెస్ నాయకులు ఆత్రం సక్కు, సోయం బాపురావు, ఆడే గజేందర్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement