త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Joginapally Santosh Kumar | ఐసీఎఫ్ఎస్ ప‌రిశోధ‌న‌లు ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి : జోగిన‌ప‌ల్లి సంతోష్ కుమార్‌

Joginapally Santosh Kumar | లండన్ క్లైమేట్ యాక్షన్ వీక్ (London Climate Action Week) పర్యటనలో భాగంగా అంతర్జాతీయ సుస్థిరత కేంద్రం (ICFS) సందర్శన అత్యంత స్ఫూర్తిదాయకంగా నిలిచిందని రాజ్యసభ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ (Joginapally Santosh Kumar) పేర్కొన్నారు.

D

Telangana | Published On Jun 30, 2026, 1.01 pm IST

Joginapally Santosh Kumar | ఐసీఎఫ్ఎస్ ప‌రిశోధ‌న‌లు ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి : జోగిన‌ప‌ల్లి సంతోష్ కుమార్‌
Advertisement

Joginapally Santosh Kumar | లండన్ క్లైమేట్ యాక్షన్ వీక్ (London Climate Action Week) పర్యటనలో భాగంగా అంతర్జాతీయ సుస్థిరత కేంద్రం (ICFS) సందర్శన అత్యంత స్ఫూర్తిదాయకంగా నిలిచిందని రాజ్యసభ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ (Joginapally Santosh Kumar) పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా ఐసీఎఫ్ఎస్ (ICFS) ప్రతినిధి సచిన్ నందా, బృందంతో ప్రత్యేకంగా భేటీ అవ‌డం సంతోసాన్నిచ్చింద‌న్నారు.

భారతదేశం, పాశ్చాత్య దేశాల మధ్య ప్రజలు, పర్యావరణం, ఆర్థిక ప్రయోజనాలే పరమావధిగా ఈ సంస్థ పరిశోధనలు సాగిస్తోంద‌ని సంతోష్ కుమార్ ఈ సంద‌ర్భంగా తెలిపారు. ముఖ్యంగా యూకే–భారత్ సంబంధాలు, పర్యావరణం-సంస్కృతి, సుస్థిర ఆర్థిక వ్యవస్థతో పాటు భవిష్యత్తులో ప్రజాస్వామ్యం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఆరోగ్య సంరక్షణ (preventative healthcare) వంటి వైవిధ్యభరితమైన అంశాలపై వారు చేస్తున్న విస్తృత పరిశోధనలు ఎంతగానో ఆకట్టుకున్నాయని వెల్లడించారు.

జాతీయ భద్రతలో 'నీటి సంరక్షణ' అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని ఐసీఎఫ్ఎస్ బృందం స్పష్టం చేసింద‌న్నారు. వారి లక్ష్యం తాము చేపట్టిన 'ఇగ్నైటింగ్ మైండ్స్' సంస్థ ఆశయాలకు అద్దం పడుతోందని సంతోష్ కుమార్‌ అభిప్రాయపడ్డారు. భార‌త‌దేశం, ప్ర‌పంచం క‌లిసి ఎదుగుతాయి అనే ఏకైక స‌త్యంతో రెండు సంస్థ‌లు ప‌ర‌స్ప‌ర స‌హ‌కారంతో ముందుకు సాగుతాయ‌ని ఈ సంద‌ర్భంగా సంతోష్ కుమార్ ఆశాభావం వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు ఎక్స్ వేదిక‌గా ట్వీట్ పెట్టారు.

Advertisement
Advertisement