Kyama Mallesh | ఏకో టౌన్ పేరుతో డంపింగ్ యార్డా? కచ్చితంగా అడ్డుకుంటం
Kyama Mallesh | స్థానిక ప్రజల అభిప్రాయ సేకరణ చేయకుండా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఏకో టౌన్ పేరుతో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయడం సరికాదని బీఆర్ఎస్ లీడర్ క్యామ మల్లేష్ మండిపడ్డారు. అక్కడ డంపింగ్ యార్డు పెడితే ప్రజల తరఫున కచ్చితంగా అడ్డుకుంటామని హెచ్చరించారు.
- మూసీ పక్కనే డంపింగ్యార్డు పెడితే మురుగంతా మూసీలనే కలుస్తది
- ఇగ ప్రక్షాళన చేసి ఏం లాభం?
- సీఎం, మంత్రులు పనికిరాని ఆలోచనలు చేస్తున్నరు
- కమీషన్ల కోసమే 494 ఎకరాల విలువైన భూమి కేటాయించారు
- ఇబ్రహీంపట్నం పరిధిలో ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎంపీకి కండ్లు కనిపిస్తలేవా
- మీడియా సమావేశంలో క్యామ మల్లేష్ ఆగ్రహం
Kyama Mallesh | త్రినేత్ర.న్యూస్: స్థానిక ప్రజల అభిప్రాయ సేకరణ చేయకుండా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఏకో టౌన్ పేరుతో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయడం సరికాదని బీఆర్ఎస్ లీడర్ క్యామ మల్లేష్ మండిపడ్డారు. పైగా జపాన్ కంపెనీకి కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విలువైన 494 ఎకరాల భూమిలో డంపింగ్ యార్డు బదులుగా ఐటీ కంపెనీలు పెట్టాలని సూచించారు. అక్కడ డంపింగ్ యార్డు పెడితే ప్రజల తరఫున కచ్చితంగా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన తెలంగాణ భవన్లో మంగళవారం మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రానికి ఎక్కువ రెవెన్యూ ఇచ్చే రంగారెడ్డి జిల్లాలో డంపింగ్ యార్డు పెడితే ప్రజల వ్యతిరేకత తప్పదు. కమీషన్ల కోసం 494 ఎకరాలు ఏకో టౌన్ పేరుతో డంపింగ్యార్డ్కు కేటాయించారు. ఇబ్రాహీంపట్నం పరిధిలో ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ కళ్లు కన్పించడం లేదా? కమీషన్ల కోసం నోరు విప్పడం లేదా? మూసీ పక్కనే డంపింగ్ యార్డు పెడితే వర్షానికి మురుగు నీరు మూసీలోకి పోతుంది. సీఎం రేవంత్ ఇక మూసీని ఏం ప్రక్షాళన చేస్తారు అని మల్లేశ్ నిలదీశారు.
ఆర్ఆర్ఆర్ లోపల డంపింగ్యార్డు ఏర్పాటు చేయడం వల్ల కాలుష్యం పెరుగుతుంది. సీఎం, మంత్రులు అనాలోచిత నిర్ణయాలు ప్రజలకి శాపంగా మారుతున్నాయి. రాష్ట్రానికి ఎక్కువ రెవెన్యూ ఇచ్చే రంగారెడ్డి జిల్లాలో డంపింగ్యార్డు పెడితే ప్రజల వ్యతిరేకత తప్పదు. మూసీ ప్రాజెక్టును మేం వ్యతిరేకించడం లేదు. కానీ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేయాలి. ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే డంపింగ్యార్డ్ను అడ్డుకోకుంటే ఆయనకు బుద్ధి చెప్తాం. డంపింగ్యార్డ్ను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ తరఫున ఎంతవరకైనా పోరాటం చేస్తాం అని క్యామ మల్లేశ్ తేల్చి చెప్పారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Sunil Mittal, Revanth Reddy | ఎయిర్టెల్కు రెండో హెడ్ క్వార్టర్గా హైదరాబాద్
జూన్ 30, 2026

CM Revanth Reddy | మార్కెట్ రేటు ప్రకారమే యాదగిరిగుట్ట భూముల కేటాయింపు : సీఎం రేవంత్ రెడ్డి
జూన్ 30, 2026

Niranjan Reddy | అప్పుడు మృగశిర కార్తి వచ్చినట్లే రైతుబంధు పడేది.. రేవంత్ సర్కారేమో పిల్లిమొగ్గలేస్తుంది
జూన్ 30, 2026
తాజావార్తలు
- ●Sunil Mittal, Revanth Reddy | ఎయిర్టెల్కు రెండో హెడ్ క్వార్టర్గా హైదరాబాద్
- ●Bhagyashri Borse | లెనిన్ కోసం భాగ్యశ్రీ బోర్సే రెమ్యూనరేషన్ - మరీ అంత తక్కువా!
- ●Divya Suresh | ప్రముఖ నటికి వేధింపులు.. నడిరోడ్డుపై అసభ్యకరంగా తాకుతూ
- ●Samsung Galaxy A27 5G | శాంసంగ్ నుంచి గెలాక్సీ ఎ27 5జి ఫోన్.. ఏఐ ఫీచర్లు, పవర్ఫుల్ డిస్ప్లే..
- ●CM Revanth Reddy | మార్కెట్ రేటు ప్రకారమే యాదగిరిగుట్ట భూముల కేటాయింపు : సీఎం రేవంత్ రెడ్డి
- ●Ntr | మురుగన్ తమిళ దేవుడు - పురాణాలను వక్రీకరించొద్దు - ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీపై తమిళ తంబీల ఫైర్

Sunil Mittal, Revanth Reddy | ఎయిర్టెల్కు రెండో హెడ్ క్వార్టర్గా హైదరాబాద్

Bhagyashri Borse | లెనిన్ కోసం భాగ్యశ్రీ బోర్సే రెమ్యూనరేషన్ - మరీ అంత తక్కువా!

Divya Suresh | ప్రముఖ నటికి వేధింపులు.. నడిరోడ్డుపై అసభ్యకరంగా తాకుతూ

Samsung Galaxy A27 5G | శాంసంగ్ నుంచి గెలాక్సీ ఎ27 5జి ఫోన్.. ఏఐ ఫీచర్లు, పవర్ఫుల్ డిస్ప్లే..



