త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Niranjan Reddy | అప్పుడు మృగ‌శిర కార్తి వ‌చ్చిన‌ట్లే రైతుబంధు ప‌డేది.. రేవంత్ స‌ర్కారేమో పిల్లిమొగ్గ‌లేస్తుంది

Niranjan Reddy | కేసీఆర్ పాలనలో మృగశిర కార్తి వచ్చినట్లే రైతుబంధు రైతుల ఖాతాల్లో పడిపోయేదని.. ఇప్పుడు రేవంత్ స‌ర్కారేమో పిల్లిమొగ్గ‌లేస్తుంద‌ని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్‌రెడ్డి విమ‌ర్శించారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం రైత‌న్న‌ల‌కు రూ.30 వేల కోట్ల‌ రైతు భ‌రోసా ఎగ్గొంటింద‌న్నారు.

S

Telangana | Published On Jun 30, 2026, 2.22 pm IST

Niranjan Reddy | అప్పుడు మృగ‌శిర కార్తి వ‌చ్చిన‌ట్లే రైతుబంధు ప‌డేది.. రేవంత్ స‌ర్కారేమో పిల్లిమొగ్గ‌లేస్తుంది
Advertisement
  • నేరుగా ఖాతాల్లో వేసేందుకు స‌భ‌లు పెట్టుడెందుకు
  • రైతు భ‌రోసా పేరుతో పీఆర్ స్టంట్లు వేస్తున్న‌రు
  • ఎగ్గొట్టిన‌వి ఎప్పుడిస్తారో చెప్పాలి
  • మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్‌రెడ్డి విమ‌ర్శ‌లు

Niranjan Reddy | త్రినేత్ర‌.న్యూస్: కేసీఆర్ పాలనలో మృగశిర కార్తి వచ్చినట్లే రైతుబంధు రైతుల ఖాతాల్లో పడిపోయేదని.. ఇప్పుడు రేవంత్ స‌ర్కారేమో పిల్లిమొగ్గ‌లేస్తుంద‌ని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్‌రెడ్డి విమ‌ర్శించారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం రైత‌న్న‌ల‌కు రూ.30 వేల కోట్ల‌ రైతు భ‌రోసా ఎగ్గొంటింద‌న్నారు. అవి ఎప్పుడిస్తారో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ఈమేర‌కు ఆయ‌న మంగ‌ళ‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌లో ప్ర‌శ్నించారు.

ఒక్కసారి రైతుబంధు వేయడం మొదలయితే ఏ రోజు ఏ రైతు ఖాతాలో, ఎన్ని ఎకరాలకు సంబంధించిన డబ్బులు పడతాయో సామాన్య రైతుకు కూడా తెలిసిపోయేది. ఎకరాకు ఏడాదికి రూ.15 వేలు, కౌలు రైతులకు, భూ యజమానులకు రైతుభరోసా, రైతు కూలీలకు రైతుభరోసా అని హామీ ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రైతులను దారుణంగా మోసం చేసింది. రైతుభరోసా అమలు విషయంలో రేవంత్ సర్కార్ పిల్లిమొగ్గలు వేస్తుంది అని నిరంజ‌న్‌రెడ్డి విమ‌ర్శించారు.

స‌భ‌ల పేరుతో వృథా ఖ‌ర్చులు..

ఎకరాకు రూ.15 వేలను రూ.12 వేలకు కుదించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మూడుసార్లు రైతుభరోసా ఎగ్గొట్టారు. ఒకసారి ఊర్ల వారీగా రైతుభరోసా వేశారు. అది గందరగోళంగా మారడంతో మళ్లీ ఎకరాల వారీగా వేశారు. దాన్ని మధ్యలోనే ఆపేశారు. గత యాసంగిలో అందరు రైతులకు అని చెప్పి రెండెకరాల వరకు వేసి చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు రైతు భరోసా అంటూ మళ్లీ కొత్త నాటకం మొదలుపెట్టారు. రైతుల ఖాతాల్లో డబ్బులు వేయడానికి సభల పేరుతో వృథా ఖర్చులు ఎందుకు? అని మాజీ మంత్రి ప్ర‌శ్నించారు.

కాంగ్రెస్‌వి పీఆర్ స్టంట్లు..

పంటల కొనుగోళ్ల విషయంలోనూ ఈ సర్కారు చేతులెత్తేసింది. కేంద్రం ఎంత కొంటే అంతే కొంటాం అని చెప్పి బాధ్యతల నుండి తప్పుకుంది. యూరియా యాప్ రైతులకు శాపంగా మారింది. ఈ వైఫల్యాల నుండి రైతాంగం దృష్టిని మరల్చడానికి రైతుభరోసా పేరుతో కాంగ్రెస్ పీఆర్ స్టంట్లు చేస్తుంది. రైతులందరికీ రైతుభరోసా వేయాలి. గతంలో ఎగ్గొట్టిన రైతుభరోసా నిధులు విడుదల చేయాలి అని నిరంజ‌న్‌రెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement