త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hiroshima Delegation | తెలంగాణ అసెంబ్లీని సంద‌ర్శించిన హిరోషిమా ప్రతినిధుల బృందం

Hiroshima Delegation | జ‌పాన్ హిరోషిమాకు చెందిన ప్ర‌తినిధుల బృందం తెలంగాణ శాసనసభ, శాసన మండలిని సందర్శించింది. ఈ సందర్భంగా తెలంగాణ శాసన మండలి చైర్మ‌న్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్‌ ప్రతినిధులకు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు.

P

Telangana | Published On Jun 5, 2026, 3.45 pm IST

Hiroshima Delegation | తెలంగాణ అసెంబ్లీని సంద‌ర్శించిన హిరోషిమా ప్రతినిధుల బృందం
Advertisement

Hiroshima Delegation | జ‌పాన్ హిరోషిమాకు చెందిన ప్ర‌తినిధుల బృందం తెలంగాణ శాసనసభ, శాసన మండలిని సందర్శించింది. ఈ సందర్భంగా తెలంగాణ శాసన మండలి చైర్మ‌న్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్‌ ప్రతినిధులకు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. శాసనసభ, శాసన మండలి సమావేశ మందిరాలను సందర్శించిన అనంతరం ప్రతినిధుల బృందం చైర్మన్ ఛాంబర్‌లో సమావేశమైంది. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచిందన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ప్రపంచంలోని అనేక దేశాలకు చెందిన ప్రజలు నివసిస్తూ, తమ వ్యాపార కార్యకలాపాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారని తెలిపారు.

శాసనసభ, శాసన మండలిలోని ప్రజాప్రతినిధులు సమర్థవంతంగా చట్టాల రూపకల్పనలో భాగస్వాములవుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూరదృష్టి, నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని వివరించారు. హిరోషిమా రాష్ట్రానికి చెందిన ప్రతినిధుల బృందం తెలంగాణను సందర్శించడం రెండు ప్రాంతాల మధ్య స్నేహపూర్వక సంబంధాలను మరింత బలోపేతం చేసే శుభపరిణామమని గుత్తా అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో శాసన మండలి విప్‌లు అద్దంకి దయాకర్, వెంకట నర్సింగరావు, ఎమ్మెల్సీలు దాసోజు శ్రావణ్, అంజి రెడ్డి, ఎమ్మెల్యేలు టీ రామ్మోహన్ రెడ్డి, పాల్వాయి హరీశ్‌, శాసన మండలి కార్యదర్శి డాక్ట‌ర్ నర్సింహాచార్యులు, శాసనసభ కార్యదర్శి ఆర్ తిరుపతి పాల్గొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement