త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jagadish Reddy | ముఖ్యమంత్రి మూసీ కంపు అంతా అసెంబ్లీలో వదిలారు : జగదీశ్ రెడ్డి

ముఖ్యమంత్రికి డబ్బా కొట్టడానికా మేము సభకు వచ్చేది. ఇస్టారాజ్యంగా స్పీకర్ సభను నడిపిస్తున్నారు. స్పీకర్ వైఖరి, ముఖ్యమంత్రి మాట్లాడిన భాషకు నిరసనగా అసెంబ్లీని వాకౌట్ చేశామని జగదీశ్ రెడ్డి వెల్లడించారు.

J

Telangana | Published On Jan 2, 2026, 2.56 pm IST

Jagadish Reddy | ముఖ్యమంత్రి మూసీ కంపు అంతా అసెంబ్లీలో వదిలారు : జగదీశ్ రెడ్డి
Advertisement

Jagadish Reddy | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ కంపు అంతా తన నోటి ద్వారా అసెంబ్లీలో వదిలారని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ శాసనసభ రోజురోజుకూ విలువలు కోల్పోతోందన్నారు. బీఆర్ఎస్ హయాంలో స్పీకర్లు ప్రజాస్వామ్యయుతంగా ఉండేవారు కానీ ఇప్పుడు ప్రతిపక్షం గొంతు నొక్కుతూ అధికార పార్టీ దాడి చేస్తోందన్నారు.

దేశంలో ఏ ముఖ్యమంత్రి మాట్లాడని విధంగా రేవంత్ రెడ్డి అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగజారి మరి మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రిని విమర్శిస్తే మైకు ఇవ్వమని స్పీకర్ అంటున్నారు. సభలో స్పీకర్ మౌనంగా ఉండిపోతున్నారు. స్పీకర్ సభ నడిపించే విధానాన్ని మర్చిపోయారు. ఒకే ప్రశ్నపై రెండు గంటల పాటు మాట్లాడడం ఏ శాసనసభ చరిత్రలో లేదు. ప్రధాన ప్రతిపక్షంగా మాకు అవకాశం ఇవ్వకుండా మరో పార్టీకి అవకాశం ఇచ్చారు. మూసి ప్రక్షాళనపై మేము మాట్లాడుతుండగానే మా మైకులు కట్ చేశారు. ముఖ్యమంత్రికి డబ్బా కొట్టడానికా మేము సభకు వచ్చేది. ఇస్టారాజ్యంగా స్పీకర్ సభను నడిపిస్తున్నారు. స్పీకర్ వైఖరి, ముఖ్యమంత్రి మాట్లాడిన భాషకు నిరసనగా అసెంబ్లీని వాకౌట్ చేశామని జగదీశ్ రెడ్డి వెల్లడించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement