Harish Rao | టెలిమెట్రీల నిధులు దారి మళ్లిస్తుంటే ప్రభుత్వం చోద్యం చూడడం సిగ్గుచేటు : హరీశ్రావు
Harish Rao | కృష్ణా నదీ జలాల వినియోగ లెక్కలు తేల్చేందుకు టెలిమెట్రీల కోసం కేటాయించిన రూ.4.18 కోట్ల నిధులను కేఆర్ఎంబీ (KRMB) దారి మళ్లిస్తుంటే తెలంగాణ (Telangana) ప్రభుత్వం చోద్యం చూడడం సిగ్గుచేటని బీఆర్ఎస్ (BRS) శాసనసభాపక్ష ఉపనేత హరీశ్రావు (Harish Rao) అన్నారు. ఉద్దేశపూర్వకంగానే టెలిమెట్రీల ఏర్పాటు ప్రక్రియను ఆలస్యం చేస్తూ, కృష్ణా జలాల ఏపీ అక్రమ వినియోగానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం దుర్మార్గమని మండిపడ్డారు.
Harish Rao | కృష్ణా నదీ జలాల వినియోగ లెక్కలు తేల్చేందుకు టెలిమెట్రీల కోసం కేటాయించిన రూ.4.18 కోట్ల నిధులను కేఆర్ఎంబీ (KRMB) దారి మళ్లిస్తుంటే తెలంగాణ (Telangana) ప్రభుత్వం చోద్యం చూడడం సిగ్గుచేటని బీఆర్ఎస్ (BRS) శాసనసభాపక్ష ఉపనేత హరీశ్రావు (Harish Rao) అన్నారు. ఉద్దేశపూర్వకంగానే టెలిమెట్రీల ఏర్పాటు ప్రక్రియను ఆలస్యం చేస్తూ, కృష్ణా జలాల ఏపీ అక్రమ వినియోగానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం దుర్మార్గమని మండిపడ్డారు. జూన్ 2016లో జరిగిన కేఆర్ఎంబీ సమావేశ నిర్ణయం ప్రకారం మొదటి దశలో 18 చోట్ల టెలిమెట్రీ పరికరాలు ఏర్పాటు చేయగా, రెండో దశలో ఇంకా తొమ్మిది చోట్ల ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ ఇప్పటివరకు అమలు కాకపోవడం దురదృష్టకరమని అన్నారు.
కేఆర్ఎంబీ నిర్ణయాన్ని ధిక్కరిస్తూ టెలీమెట్రీ ఏర్పాటు కోసం నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంటే ఏపీ ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు. ఏపీ మీద ఒత్తిడి చేయకుండా ఎందుకు మౌనంగా ఉన్నారని దుయ్యబట్టారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణ హక్కులను కాపాడాల్సిన కేఆర్ఎంబీ, రాష్ట్ర ప్రభుత్వ అలసత్వాన్ని ఆసరాగా చేసుకుని తెలంగాణకు అన్యాయం చేస్తుంటే ఎందుకు స్పందించడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ, ఏపీ, కేంద్రంలోని బీజేపీ మూడు కలిసి టెలీమెట్రిల ఏర్పాటును నిర్లక్ష్యం చేస్తూ, తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్నాయని ధ్వజమెత్తారు.
టెలిమెట్రీ ఏర్పాటు చేస్తున్నామని ప్రచారం చేసుకోవడమే తప్ప రెండేళ్ల నుండి కేంద్రం చేసింది ఏం లేదని ఎద్దేవా చేశారు. సబ్ జ్యుడీస్ అని సాకులు చెప్పే కేంద్రానికి, సుప్రీం కోర్టులో కేసు ఉన్నప్పటికీ కేసీఆర్ 18 చోట్ల టెలీమెట్రీలు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. పోలవరం నల్లమల సాగర్ విషయంలో మొద్దు నిద్ర ప్రదర్శించినట్లుగానే, టెలీమెట్రీల ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కావాలనే నిర్లక్ష్యంగా వ్యవహరించడం శోచనీయమన్నారు. రూ. 4.18 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ నిధులను వెంటనే రికవరీ అయ్యేలా చేసి, టెలీమెట్రీల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసేందుకు కృషి చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. కేవలం లేఖలు రాస్తూ కాలయాపన చేయకుండా, నిధులు మళ్లించిన కేఆర్ఎంబీపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని డిమాండ్ చేశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



