త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chamala Kiran Kumar Reddy | విద్యార్థుల‌ను కించ‌ప‌ర‌చ‌డం సీఎం ఉద్దేశం కాదు.. డిగ్రీలు పూర్త‌యినా స్కిల్స్ ఉంట‌లేవ‌నే ఆయ‌న బాధ‌

Chamala Kiran Kumar Reddy | విద్యార్థుల‌ను కించ‌ప‌ర‌చ‌డం సీఎం రేవంత్‌రెడ్డి ఉద్దేశం కాద‌ని భువ‌న‌గిరి ఎంపీ చామ‌ల కిర‌ణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. డిగ్రీలు పూర్త‌యిన త‌ర్వాత కూడా ఇంజినీరింగ్ విద్యార్థులు స‌రిగా రాణించ‌లేక‌పోతున్నార‌ని.. తెలంగాణలో బోధనా ప్రమామాలు ఆశించిన స్థాయిలో లేవని చెప్పడమే ఆయన ఉద్దేశమని తెలిపారు.

S

Telangana | Published On Jul 31, 2026, 3.23 pm IST

Chamala Kiran Kumar Reddy | విద్యార్థుల‌ను కించ‌ప‌ర‌చ‌డం సీఎం ఉద్దేశం కాదు.. డిగ్రీలు పూర్త‌యినా స్కిల్స్ ఉంట‌లేవ‌నే ఆయ‌న బాధ‌
Advertisement
  • అబ్ర‌హం లింక‌న్‌, విన్సెంట్ చ‌ర్చిల్‌కు విద్య లేక‌పోయినా మెద‌డుంది.. కానీ కేటీఆర్‌కే అలాంటి మెద‌డు లేదు
  • కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్య‌లు

Chamala Kiran Kumar Reddy | త్రినేత్ర‌.న్యూస్: విద్యార్థుల‌ను కించ‌ప‌ర‌చ‌డం సీఎం రేవంత్‌రెడ్డి ఉద్దేశం కాద‌ని భువ‌న‌గిరి ఎంపీ చామ‌ల కిర‌ణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. డిగ్రీలు పూర్త‌యిన త‌ర్వాత కూడా ఇంజినీరింగ్ విద్యార్థులు స‌రిగా రాణించ‌లేక‌పోతున్నార‌ని.. తెలంగాణలో బోధనా ప్రమామాలు ఆశించిన స్థాయిలో లేవని చెప్పడమే ఆయన ఉద్దేశమని తెలిపారు. అందుకే డిగ్రీలు పూర్తయిన తర్వాత కూడా ఇంజినీరింగ్ విద్యార్థులు సరిగా రాణించలేకపోతున్నారన్న‌దే ఆయ‌న బాధ అని చెప్పారు. ఉపాధి పొందడంలోనూ ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.నిన్నరేవంత్ రెడ్డి విద్యా విషయక సమావేశంలో మాట్లాడిన దానిపై ఆయ‌న‌ ఢిల్లీలో ఓ వార్త చాన‌ల్‌తో మాట్లాడుతూ పై విధంగా స్పందించారు.

రేవంత్‌ ప్రధానంగా నైపుణ్యాభివృద్ధి గురించే మాట్లాడాలనుకున్నారు. మరోవైపు కేటీఆర్ మాత్రం తను మెరుగైన ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ చేసుకోవాలని చూస్తున్నారు. కేటీఆర్ తన తండ్రి నేపథ్యం వల్ల మేనేజ్‌మెంట్ కోటా ద్వారానే పైకొచ్చారు. కేటీఆర్ ఒక విషయాన్ని గ్రహించాలి. అమెరికా అధ్యక్షుడు అబ్రహాంలింకన్, బ్రిటన్ ప్రధాని విన్సెంట్ చర్చిల్‌కు ఉచ్ఛ విద్య లేకపోయినా.. వారికి అద్భుతమైన మెదడు ఉండేది. కానీ కేటీఆర్‌కు మాత్రం అలాంటి మెదడు లేదు" అని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమ‌ర్శించారు.

Advertisement
Advertisement