త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Inter Student | ఇంట‌ర్ ప‌రీక్ష‌కు వెళ్లి.. మృత శిశువుకు జ‌న్మ‌నిచ్చిన విద్యార్థిని

Inter Student | ఇంట‌ర్ ప‌రీక్ష రాసేందుకు వెళ్లిన ఓ విద్యార్థిని.. ప‌రీక్షా కేంద్రంలోని బాత్రూమ్‌లో మృత శిశువుకు జ‌న్మ‌నిచ్చింది. ఈ ఘ‌ట‌న భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా పాల్వంచ‌లో శుక్ర‌వారం వెలుగు చూసింది.

S

Telangana | Published On Feb 28, 2026, 7.33 am IST

Inter Student | ఇంట‌ర్ ప‌రీక్ష‌కు వెళ్లి.. మృత శిశువుకు జ‌న్మ‌నిచ్చిన విద్యార్థిని
Advertisement

Inter Student | త్రినేత్ర‌.న్యూస్ : ఇంట‌ర్ ప‌రీక్ష రాసేందుకు వెళ్లిన ఓ విద్యార్థిని.. ప‌రీక్షా కేంద్రంలోని బాత్రూమ్‌లో మృత శిశువుకు జ‌న్మ‌నిచ్చింది. ఈ ఘ‌ట‌న భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా పాల్వంచ‌లో శుక్ర‌వారం వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. పాల్వంచ‌లోని ఓ ప‌రీక్షా కేంద్రానికి ప్ర‌థ‌మ సంవ‌త్స‌రం ఇంగ్లీష్ ప‌రీక్ష రాసేందుకు 16 ఏళ్ల విద్యార్థిని వ‌చ్చింది. ప‌రీక్ష ఉద‌యం 9 గంట‌ల‌కు ప్రారంభమైంది. 30 నిమిషాల త‌ర్వాత ఇన్విజిలేట‌ర్ అనుమ‌త‌తిలో స‌ద‌రు బాలిక బాత్రూమ్‌కు వెళ్లింది. విద్యార్థిని ఎంత‌సేప‌టికి రాక‌పోవ‌డంతో ఇన్విజిలేట‌ర్‌కు అనుమానం వ‌చ్చి.. బాత్రూమ్ వైపు వెళ్లి చూడ‌గా షాక్‌కు గురైంది.

విద్యార్థిని మెల్లిగా న‌డుచుకుంటూ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ర‌క్త‌పు మ‌ర‌క‌లు కూడా గ్ర‌హించింది. దీంతో బాలిక‌ను నిల‌దీయ‌గా అస‌లు విష‌యం వెలుగు చూసింది. గర్భంతో ఉండడంతో నొప్పులు భరించలేక మరుగుదొడ్డికి వెళ్లి మృతశిశువుకు జన్మనిచ్చినట్లు తెలిపింది.

సిబ్బంది వెళ్లిచూడగా.. బేసిన్‌లో మృతశిశువు ఆచూకీ దొరికింది. పరువు పోతుందనే భయంతోనే ఎవరికీ అనుమానం రాకుండా శిశువును బాత్‌రూం బేసిన్‌లో కుక్కినట్లు తెలిసింది. పరీక్ష కేంద్రం నిర్వాహకులు విషయాన్ని జిల్లా ఉన్నతాధికారులు, పోలీసులకు చేరవేశారు. బాలికను పోలీసులు ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. మృతశిశువును 108 వాహనంలో మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై తమకు ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. ఎవరూ ఫిర్యాదు చేయని పక్షంలో బాలిక విద్యనభ్యసిస్తున్న కళాశాల యాజమాన్యం ద్వారా ఫిర్యాదు స్వీకరిస్తామన్నారు.

Advertisement
Advertisement