త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Inter Admissions | ఇంటర్‌ ప్రవేశాలకు బ్రేక్‌.. సంస్కరణల అమలుకేనా?

Inter Admissions | రాష్ట్రంలో ఇంటర్‌ ప్రవేశాల ప్రక్రియకు (Inter Admissions) బ్రేక్‌ పడింది. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు, గురుకులాల్లో మొద‌టి సంవ‌త్స‌రంలో ప్ర‌వేశాల‌ను ప్రారంభించ వ‌చ్చ‌ని, ఈ నెల 8 నుంచి దరఖాస్తులు స్వీకరించాల‌ని ఇంట‌ర్ బోర్డ్‌ కార్య‌ద‌ర్శి అడ్మిష‌న్ల షెడ్యూల్‌ను ప్ర‌క‌టించారు.

G

Telangana | Published On May 6, 2026, 6.45 am IST

Inter Admissions | ఇంటర్‌ ప్రవేశాలకు బ్రేక్‌.. సంస్కరణల అమలుకేనా?
Advertisement

Inter Admissions | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలో ఇంటర్‌ ప్రవేశాల ప్రక్రియకు (Inter Admissions) బ్రేక్‌ పడింది. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు, గురుకులాల్లో మొద‌టి సంవ‌త్స‌రంలో ప్ర‌వేశాల‌ను ప్రారంభించ వ‌చ్చ‌ని, ఈ నెల 8 నుంచి దరఖాస్తులు స్వీకరించాల‌ని ఇంట‌ర్ బోర్డ్‌ కార్య‌ద‌ర్శి అడ్మిష‌న్ల షెడ్యూల్‌ను సోమ‌వారం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. జూన్‌ 1 నుంచి తరగతులు ప్రారంభించాలని అందులో పేర్కొన్నారు. అయితే దానిని 24 గంటల్లోపే వాటికి బ్రేక్ వేశారు. తదుపరి ఉత్తర్వులు వెలువడేదాక ప్రవేశాలు చేపట్టకూడ‌ద‌ని స్పష్టం చేశారు. ఇంటర్‌ విద్యలో కొన్ని కీల‌క‌ సంస్కరణలు ప్ర‌వేశ‌పెట్టాల‌ని ప్ర‌భుత్వం భావిస్తున్న‌ది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌వేశాల ప్ర‌క్రియ‌కు బ్రేక్ వేసిన‌ట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ ఎయిడెడ్‌, అన్ఎయిడెడ్‌, కోఆప‌రేటివ్‌, గురుకుల‌, మోడ‌ల్ స్కూల్‌, కాంపోజిట్ డిగ్రీ కాలేజీల‌కు ఇది వ‌స్తుందని తెలిపారు. దీంతో ప్రభుత్వం ప్ర‌వేశ‌పెట్ట‌బోయే సంస్కరణలపై చర్చ నడుస్తున్న‌ది.

రాష్ట్రంలో పలుచోట్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్యాంప్‌సలోనే జూనియర్‌ కాలేజీలు కూడా ఉన్నాయి. కొత్త విద్యాసంవత్సరంలో తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్లు ఏర్పాటు కానున్నాయి. ఇందులో నర్సరీ నుంచి 12వ తరగతి వరకు బోధన ఉంటుంది. ఒకే క్యాంప్‌సలో 12వ తరగతి వరకు ఉన్న చోట్ల ప్రవేశాలు ప్రత్యేకంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు స‌మాచారం.

పాఠశాల విద్య 12వ తరగతి వరకు ఉండాలని జాతీయ విద్యా విధానంలో పొందుపరిచిన విష‌యం తెలిసిందే. రాష్ట్ర విద్యా కమిషన్ కూడా ప్రభుత్వానికి ఇదే విషయం సూచించింది. అదేవిధంగా ఇట‌ర్ బోర్డు, ప‌దోత‌ర‌గ‌తికి ప్ర‌త్యేక వ్య‌వ‌స్థ‌లు ఎందుక‌ని కేంద్ర విద్యాశాఖ ఇటీవ‌ల ప్ర‌శ్నించింది. ఇంట‌ర్ బోర్డును పాఠ‌శాల విద్యాశాఖ‌లో విలీనం చేయాల‌ని సూచించింది. ఇందులో భాగంగా కొన్ని సంస్క‌ర‌ణ‌ల‌ను వ‌చ్చే విద్యాసంవ‌త్స‌రం నుంచి అమ‌లు చేయాల‌ని ప్ర‌భుత్వం భావిస్తున్న‌ది. ఇక డిగ్రీలో దోస్త్‌ త‌ర‌హాలోనే ఇంట‌ర్‌లో అడ్మిష‌న్ల‌ను ఆన్‌లైన్‌లో చేప‌ట్టాల‌ని ప్ర‌తిపాద‌న కూడా ప్ర‌భుత్వ ప‌రిశీల‌నలో ఉన్న‌ది. ఈ నేప‌థ్యంలో ఇంట‌ర్ ప్ర‌వేశాల‌ను తాత్కాలికంగా నిలిపివేసింది.

Advertisement
Advertisement