త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Book Fair | హైదరాబాద్ బుక్ ఫెయిర్ వ్యవస్థాపకులు గోపాలరావు ఇక‌లేరు..

Book Fair | హైదరాబాద్ బుక్ ఫెయిర్ వ్యవస్థాపకులు ఎస్.గోపాలరావు(90) కొండాపూర్‌లో క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న ఆయ‌న‌.. కుమారుడి నివాసంలోనే తుదిశ్వాస విడిచారు.

S

Telangana | Published On Apr 24, 2026, 4.36 pm IST

Book Fair | హైదరాబాద్ బుక్ ఫెయిర్ వ్యవస్థాపకులు గోపాలరావు ఇక‌లేరు..

సంక్షిప్త సారాంశం

హైద‌రాబాద్ బుక్ ఫెయిర్.. పుస్త‌క ప్రియుల‌కు సుప‌రిచిత‌మే. ప్ర‌తి ఏడాది డిసెంబ‌ర్ నెల‌లో ఎన్టీఆర్ స్టేడియంలో ఓ వారం రోజుల పాటు బుక్ ఫెయిర్ నిర్వ‌హిస్తూ వ‌స్తున్నారు. రాష్ట్రం నుంచే కాకుండా దేశం న‌లువైపులా నుంచి కూడా పుస్త‌క ప్రియులు ఈ పుస్త‌క ప్ర‌ద‌ర్శ‌న‌ను సంద‌ర్శించి త‌మ‌కిష్ట‌మైన పుస్త‌కాల‌ను కొనుగోలు చేస్తుంటారు. మ‌రి ఇంత‌టి ప్ర‌త్యేక‌త క‌లిగిన ఈ బుక్ ఫెయిర్ వ్య‌వ‌స్థ‌పాకుల గురించి ఇప్ప‌టికీ విని ఉండ‌రు. 1986లో బుక్ ఫెయిర్‌ను ఏర్పాటు చేసిన వ్య‌వ‌స్థాప‌క స‌భ్యుల్లో ఒక‌రైన ఎస్ గోపాలరావు గురువారం క‌న్నుమూశారు.

Advertisement

సంతాపం ప్రకటించిన జూలూరు గౌరీ శంకర్, కోయ చంద్రమోహన్

Book Fair | త్రినేత్ర‌.న్యూస్ : హైదరాబాద్ బుక్ ఫెయిర్ వ్యవస్థాపకులు ఎస్.గోపాలరావు(90) కొండాపూర్‌లో క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న ఆయ‌న‌.. కుమారుడి నివాసంలోనే తుదిశ్వాస విడిచారు. ఈ మేర‌కు గోపాలరావు మృతిని కుటుంబ స‌భ్యులు అధికారికంగా ప్ర‌క‌టించారు. గోపాల‌రావు మృతికి తెలంగాణ సాహిత్య అకాడ‌మీ పూర్వ అధ్య‌క్షులు జూలూరు గౌరీశంక‌ర్, బుక్ ఫెయిర్ పూర్వ కార్య‌ద‌ర్శి, తెలంగాణ బుక్ ట్ర‌స్ట్ వ్య‌వ‌స్థాప‌కులు కోయ చంద్ర‌మోహ‌న్ సంతాపం ప్ర‌క‌టించి, కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు.

సోము గోపాలరావు 1986లో హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ వ్యవస్థాపకుల్లో ఒకరు. తొలి పుస్తక ప్రదర్శనకు సమన్వయకర్తగా వ్యవహరించారు. సైంటిఫిక్ సర్వీసెస్ అనే సంస్థ ద్వారా వారు పుస్తక రంగానికి సేవలు అందించారు. అనేక పుస్తక ప్రదర్శనల నిర్వహణలో వారి పాత్ర వున్నది.

Advertisement
Advertisement