త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KCR | బాగున్నారా.. అమ్మా.. మహిళా మంత్రులకు కేసీఆర్ ఆత్మీయ పలకరింపు

KCR | ఇంటికి వచ్చిన రాష్ట్ర మహిళా మంత్రులకు తెలంగాణ (Telangana) తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) సాదరంగా ఆహ్వానం ప‌లికి బాగున్నారా అమ్మా అంటూ ప‌ల‌క‌రించారు. మేడారం జాత‌ర (Sammakka Saralamma Jatara)కు ఆహ్వానించేందుకు ఎర్ర‌వెల్లిలోని నివాసానికి వ‌చ్చిన రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ (Konda Surekha), ధ‌నసరి సీతక్క (Seethakka)లకు అతిథి మర్యాదలతో పసుపు కుంకుమలు, చీర, తాంబూలాలతో సంప్రదాయ సత్కారం చేశారు.

A

Telangana | Published On Jan 8, 2026, 6.07 pm IST

KCR | బాగున్నారా.. అమ్మా.. మహిళా మంత్రులకు కేసీఆర్ ఆత్మీయ పలకరింపు
Advertisement

మేడారం జాత‌ర‌కు కేసీఆర్‌ను ఆహ్వానించిన కొండా సురేఖ‌, సీత‌క్క‌

KCR | ఇంటికి వచ్చిన రాష్ట్ర మహిళా మంత్రులకు తెలంగాణ (Telangana) తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) సాదరంగా ఆహ్వానం ప‌లికి బాగున్నారా అమ్మా అంటూ ప‌ల‌క‌రించారు. అతిథి మర్యాదలతో పసుపు కుంకుమలు, చీర, తాంబూలాలతో ఆడబిడ్డలకు సంప్రదాయ సత్కారం చేశారు. మ‌రికొద్ది రోజుల్లో మేడారం స‌మ్మ‌క్క‌, సార‌ల‌మ్మ జాత‌ర (Sammakka Saralamma Jatara) ప్రారంభం కానున్న సంద‌ర్భంగా మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను ఆహ్వానించేందుకు రాష్ట్ర దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి కొండా సురేఖ (Konda Surekha), రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి సీతక్క (Seethakka)లు ఎర్ర‌వెల్లిలోని నివాసానికి వ‌చ్చారు. జాత‌ర‌ను సంద‌ర్శించాల్సిందిగా ప్ర‌భుత్వం త‌ర‌పున వారు ఆయ‌న‌ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు శాలువాకప్పి ఆహ్వాన పత్రికను అందజేసి, మేడారం ప్రసాదం అందజేశారు. కేసీఆర్ దంపతులు అందించిన తేనీటి విందు స్వీకరించిన మహిళా మంత్రులు, కాసేపు పరస్పర యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కొద్దిస‌మ‌యం ఇష్టాగోష్టి అనంతరం మంత్రులు తిరుగు ప్రయాణమ‌య్యారు.

Advertisement

తాజావార్తలు

Advertisement