త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

HIV | తెలుగు రాష్ట్రాల్లో ఆందోళ‌న క‌లిగిస్తున్న హెచ్ఐవీ మ‌ర‌ణాలు.. ఐదేళ్ల‌లో 44 వేల మంది మృతి

HIV | తెలుగు రాష్ట్రాల్లో హెచ్ఐవీ మ‌ర‌ణాలు (HIV deaths) ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లో (Telugu states)నూ ఐదేళ్ల కాలంలో ఈ వైర‌స్ కార‌ణంగా వేల మంది ప్రాణాలు కోల్పోయిన‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌క‌టించింది.

D

Telangana | Published On Feb 4, 2026, 1.10 pm IST

HIV | తెలుగు రాష్ట్రాల్లో ఆందోళ‌న క‌లిగిస్తున్న హెచ్ఐవీ మ‌ర‌ణాలు.. ఐదేళ్ల‌లో 44 వేల మంది మృతి
Advertisement

HIV | తెలుగు రాష్ట్రాల్లో హెచ్ఐవీ మ‌ర‌ణాలు (HIV deaths) ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లో (Telugu states)నూ ఐదేళ్ల కాలంలో ఈ వైర‌స్ కార‌ణంగా వేల మంది ప్రాణాలు కోల్పోయిన‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌క‌టించింది. 2020-24 మ‌ధ్య 44 వేల మంది హెచ్ఐవీ బాధితులు మ‌ర‌ణించిన‌ట్లు వెల్ల‌డించింది.

రాజ్య‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో ఈ విష‌యాన్ని కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రి అనుప్రియ ప‌టేల్ (Anupriya Patel) వెల్ల‌డించారు. ఓ స‌భ్యుడు అడిగిన ప్ర‌శ్న‌కు ఆమె లిఖిత పూర్వ‌కంగా స‌మాధానం ఇచ్చారు. 2020-24 మ‌ధ్య ఐదేళ్ల‌లో 44,140 మంది ప్రాణాలు కోల్పోయిన‌ట్లు చెప్పారు. అందులో ఏపీలో 32,642 మంది, తెలంగాణలో 11,498 మంది హెచ్‌ఐవీ బాధితులు మరణించిన‌ట్లు వివ‌రించారు. ఇక ఇదే కాలంలో దేశ‌వ్యాప్తంగా దాదాపు 2 ల‌క్ష‌ల హెచ్ఐవీ బాధితులు మ‌ర‌ణించిన‌ట్లు తెలిపారు.

Advertisement
Advertisement