త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TG Weather | తెలంగాణ‌లో భారీగా పెరుగ‌నున్న ఉష్ణోగ్ర‌త‌లు.. హెచ్చ‌రించిన వాతావ‌ర‌ణ‌శాఖ‌..!

TG Weather | తెలంగాణ‌లో మ‌రోసారి ఎండ‌లు పెరుగుతాయ‌ని వాతావ‌ర‌శాఖ హెచ్చ‌రించింది. మంగ‌ళ‌వారం నుంచి క్ర‌మంగా పెరిగే అవ‌కాశాలున్నాయ‌ని అంచ‌నా వేసింది. ఈ నెల 18 నుంచి 22 తేదీల మధ్య తీవ్ర ఎండలు నమోదయ్యే అవ‌కాశం ఉంద‌ని అధికారులు పేర్కొంటున్నారు.

P

Telangana | Published On May 11, 2026, 4.47 pm IST

TG Weather | తెలంగాణ‌లో భారీగా పెరుగ‌నున్న ఉష్ణోగ్ర‌త‌లు.. హెచ్చ‌రించిన వాతావ‌ర‌ణ‌శాఖ‌..!
Advertisement

TG Weather | తెలంగాణ‌లో మ‌రోసారి ఎండ‌లు పెరుగుతాయ‌ని వాతావ‌ర‌శాఖ హెచ్చ‌రించింది. మంగ‌ళ‌వారం నుంచి క్ర‌మంగా పెరిగే అవ‌కాశాలున్నాయ‌ని అంచ‌నా వేసింది. ఈ నెల 18 నుంచి 22 తేదీల మధ్య తీవ్ర ఎండలు నమోదయ్యే అవ‌కాశం ఉంద‌ని అధికారులు పేర్కొంటున్నారు. ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టికే 45 నుంచి 46 డిగ్రీల వ‌ర‌కు ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యాయి. రాబోయే రోజుల్లో తూర్పు తెలంగాణ జిల్లాల్లో 47 డిగ్రీల‌కు గ‌రిష్ట ఉష్ణోగ‌త్ర‌లు చేసే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు. హైద‌రాబాద్‌లోనూ ప‌గ‌టి ఉష్ణోగ‌త్ర‌లు 43 డిగ్రీల దాకా చేరే సూచ‌న‌లున్నాయ‌ని అధికారులు వెల్ల‌డించారు. ఎండ‌ల‌కు తోడు వ‌డ‌గాలులు వీచే ఛాన్స్ ఉంద‌ని, దాదాపుగా ప‌దిరోజులు ఇదే ప‌రిస్థితి ఉంటుంద‌ని అధికార వ‌ర్గాలు తెలిపాయి.

ఇటీవ‌ల‌, రెండుమూడురోజులు ఉష్ణోగ్ర‌త‌లు రెండు నుంచి మూడు డిగ్రీల వ‌ర‌కు త‌గ్గాయి. ఆదివారం నుంచి మ‌ళ్లీ ఉష్ణోగ్ర‌త‌లు పెరుగుతున్నాయి. ఆదివారం రాష్ట్రంలోనే అత్య‌ధికంగా నిజామాబాద్ జిల్లా సాలూర‌లో 43.1 డిగ్రీలు న‌మోద‌య్యాయి. ఆ త‌ర్వాత అత్య‌ల్పంగా మ‌హ‌బూబాబాద్ జిల్లా బాలాన‌గ‌ర్‌లో 40.2 డిగ్రీలుగా రికార్డ‌య్యాయి. ప్ర‌స్తుతం ఉష్ణోగ‌త్ర‌ల్లో పెద్ద‌గా మార్పు ఉండ‌ద‌ని, రాబోయే రోజుల్లో ఎండ‌ల తీవ్ర‌త పెరుగుతుంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డించింది. సాధారణ స్థాయితో పోలిస్తే మరో రెండు నుంచి నాలుగు డిగ్రీల వ‌ర‌కు పెరుగ‌వ‌చ్చ‌ని పేర్కొంది. ఇలా ఉండ‌గా.. సోమ‌వారం, మంగ‌ళ‌వారం ప‌లుచోట్ల మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశాలున్నాయ‌ని అంచ‌నా వేసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల‌తో కూడిన వ‌ర్షాలు ప‌డే సూచ‌న‌లున్నాయ‌ని తెలిపింది.

Advertisement
Advertisement