త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Heat Weaves | నేటి నుంచి మరింత పెరుగనున్న ఎండల తీవ్రత.. ఈ జిల్లాల‌కు రెడ్ అల‌ర్ట్‌

Heat Weaves | రాష్ట్రంలో రోజురోజుకు ఎండ‌ల తీవ్ర‌త పెరుగుతున్న‌ది. ప‌లు జిల్లాల్లో 45 డిగ్రీల గ‌రిష్ట ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వుతున్నాయి. బుధ‌వారం నుంచి నాలుగు రోజుల పాటు ఎండ వేడి (Heat Weaves ) మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌రణ కేంద్రం (IMD Hyderabad) తెలిపింది.

G

Telangana | Published On May 20, 2026, 8.09 am IST

Heat Weaves | నేటి నుంచి మరింత పెరుగనున్న ఎండల తీవ్రత.. ఈ జిల్లాల‌కు రెడ్ అల‌ర్ట్‌
Advertisement

Heat Weaves | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలో రోజురోజుకు ఎండ‌ల తీవ్ర‌త పెరుగుతున్న‌ది. ప‌లు జిల్లాల్లో 45 డిగ్రీల గ‌రిష్ట ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వుతున్నాయి. బుధ‌వారం నుంచి నాలుగు రోజుల పాటు ఎండ వేడి (Heat Weaves ) మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌రణ కేంద్రం (IMD Hyderabad) తెలిపింది. బుధ‌, గురువారాల్లో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, నల్ల‌గొండ, సూర్యాపేట జిల్లాలకు రెడ్ అలర్ట్ (Red Alert) జారీ చేసింది. ఈ జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోద‌వుతాయ‌ని వెల్ల‌డించింది.

ఇక వ‌చ్చే నాలుగైదు రోజులు ఉత్తర తెలంగాణలో వడ గాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. బుధ‌వారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మ‌ల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల‌, కరీంనగర్, పెద్దపల్లి, నల్ల‌గొండ, సూర్యాపేట, కామారెడ్డి జిల్లాల్లో వ‌డ‌గాల్పులు వీస్తాయ‌ని తెలిపింది. మ‌రోవైపు కొత్త‌గూడెం, ఖ‌మ్మం, కామారెడ్డి, మ‌హ‌భూబ్‌న‌గ‌ర్‌, నాగ‌ర్‌క‌ర్నూల్‌, వ‌న‌ప‌ర్తి జిల్లాల్లో అక్క‌డ‌క్క‌డ‌ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు గంటకు 40-50 కి.మీ.వేగంతో కూడిన వర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది.

ఆదిలాబాద్‌, జ‌గిత్యాల‌, కామారెడ్డి, క‌రీంన‌గ‌ర్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల‌, న‌ల్ల‌గొండ‌, నిర్మ‌ల్‌, నిజామాబాద్‌, సిరిసిల్ల‌, సూర్యాపేట జిల్లాల్లో 44 డిగ్రీల‌కుపైగా ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వుతాయ‌ని, ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించింది. మ‌ధ్యాహ్నం అత్య‌వ‌స‌ర‌మైతే త‌ప్ప బ‌య‌ట‌కు వెళ్ల‌కూడ‌ద‌ని పేర్కొంది.

Advertisement
Advertisement