త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Heat Wave | ఏప్రిల్ 16 వ‌ర‌కు ఎండ‌లే ఎండ‌లు.. తెలంగాణ‌కు ఆరెంజ్ అల‌ర్ట్ జారీ

Heat Wave | రాష్ట్రంలో ఎండ‌లు మండిపోతున్నాయి. పొద్దున ఏడు గంట‌ల‌కే భానుడు భ‌గ‌భ‌గ మండిపోతున్నాడు. దీంతో రాష్ట్ర ప్ర‌జ‌లు ఉక్క‌పోత‌కు అల్లాడిపోతున్నారు. ఏప్రిల్ 16 వ‌ర‌కు ప‌గ‌టి ఉష్ణోగ్ర‌త‌లు భారీగా న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది.

S

Telangana | Published On Apr 12, 2026, 5.44 pm IST

Heat Wave | ఏప్రిల్ 16 వ‌ర‌కు ఎండ‌లే ఎండ‌లు.. తెలంగాణ‌కు ఆరెంజ్ అల‌ర్ట్ జారీ
Advertisement

Heat Wave | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలో ఎండ‌లు మండిపోతున్నాయి. పొద్దున ఏడు గంట‌ల‌కే భానుడు భ‌గ‌భ‌గ మండిపోతున్నాడు. దీంతో రాష్ట్ర ప్ర‌జ‌లు ఉక్క‌పోత‌కు అల్లాడిపోతున్నారు. ఏప్రిల్ 16 వ‌ర‌కు ప‌గ‌టి ఉష్ణోగ్ర‌త‌లు భారీగా న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. ప‌లు జిల్లాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్ జారీ చేసింది.

ముఖ్యంగా రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో 16వ తేదీ వ‌ర‌కు 41 డిగ్రీల సెల్సియస్ నుంచి 44 డిగ్రీల సెల్సియ‌స్ వ‌ర‌కు ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రించింది. మిగ‌తా జిల్లాల్లోనూ ఈ స్థాయిలో ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు కానున్నాయ‌ని తెలిపింది. టీఎస్‌డీపీఎస్ రిపోర్టు ప్ర‌కారం.. హైద‌రాబాద్ న‌గ‌రంలో రాబోయే మూడు రోజుల పాటు సాధార‌ణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధిక ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అయ్యే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రించింది.

శ‌నివారం నాడు జోగులాంగ గ‌ద్వాల జిల్లాలో అత్య‌ధికంగా 41.8 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త న‌మోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 41.2 డిగ్రీలు, మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లాలో 40.1 డిగ్రీలు, జీహెచ్ఎంసీ ఏరియాలో 39.5 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అయ్యాయి.

Advertisement
Advertisement