త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | వినాయక చవితి వేళ ఆర్టీసీ చార్జీల మోత.. కాంగ్రెస్ స‌ర్కారుపై హ‌రీశ్‌రావు ధ్వ‌జం

Harish Rao | వినాయక చవితి నేపథ్యంలో ఆర్టీసీ టికెట్ల చార్జీల‌ను పెంచ‌డంపై శాస‌న‌స‌భ‌లో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హరీశ్‌రావు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మండిపడ్డారు. పండుగ వేళ సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులపై అదనపు భారం మోపడం దారుణమని విమర్శించారు.

P

Telangana | Published On Sep 12, 2026, 2.16 pm IST

Harish Rao | వినాయక చవితి వేళ ఆర్టీసీ చార్జీల మోత.. కాంగ్రెస్ స‌ర్కారుపై హ‌రీశ్‌రావు ధ్వ‌జం
Advertisement

Harish Rao | వినాయక చవితి నేపథ్యంలో ఆర్టీసీ టికెట్ల చార్జీల‌ను పెంచ‌డంపై శాస‌న‌స‌భ‌లో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హరీశ్‌రావు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మండిపడ్డారు. పండుగ వేళ సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులపై అదనపు భారం మోపడం దారుణమని విమర్శించారు. ఆర్టీసీ చార్జీల పేరుతో ప్రజల జేబులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం చిల్లు పెడుతోందని శనివారం సోషల్‌ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌–హన్మకొండ మధ్య ఏసీ బస్సు చార్జీ ఆగస్టు 20న రూ.410 ఉండగా.. సెప్టెంబర్‌ 11 నాటికి ఏకంగా రూ.570కు పెంచారని హరీశ్‌రావు పేర్కొన్నారు. కేవలం 20 రోజుల వ్యవధిలోనే ఒక్కో ప్రయాణికుడిపై రూ.160 అదనపు భారం పడిందని తెలిపారు. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా రాష్ట్రవ్యాప్తంగా వివిధ మార్గాల్లో చార్జీలు పెంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

పండుగ వేళ ప్రయాణికులపై భారం

వినాయక చవితి సందర్భంగా పెద్ద సంఖ్యలో ప్రజలు సొంతూళ్లకు తరలివెళ్తున్న సమయంలో చార్జీల పెంపు ప్రయాణికులకు మరింత ఇబ్బందిగా మారిందని హరీశ్‌రావు విమర్శించారు. ఇప్పటికే నిత్యావసరాల ధరల పెరుగుదలతో సతమతమవుతున్న సామాన్యులపై బస్సు చార్జీల భారం మోపడం సరికాదన్నారు. గతంలో రాఖీ పండుగ సమయంలోనూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలు పెంచిందని గుర్తుచేశారు. ‘మాటల్లో ఉచితాలు.. చేతల్లో ఛార్జీల మోత’ అంటూ కాంగ్రెస్‌ ప్రభుత్వ తీరుపై హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ప్రజలపై భారం మోపడం ఆపి పెంచిన ఆర్టీసీ చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ఇష్టానుసారంగా చార్జీలు పెంచి ప్రజల జేబులకు చిల్లు పెట్టాలని చూస్తే బీఆర్‌ఎస్‌ చూస్తూ ఊరుకోదని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇది ప్రజా పాలన కాదని.. ప్రజలపై దోపిడీ పాలన అని విమర్శించారు.

Advertisement
Advertisement