త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | నైనీ టెండర్ రద్దు చేశారంటే.. స్కామ్‌ జరిగినట్టే కదా..? : హరీశ్‌రావు

Harish Rao | సింగరేణి బొగ్గు, సోలార్ టెండర్ల వ్యవహారంపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నిర్వహించిన మీడియా సమావేశంపై మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌ రావు సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. బొగ్గు కుంభకోణంలో అవినీతి జరగలేదని సూటిగా చెప్పలేక, ఉప ముఖ్యమంత్రి విషయాలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారని ఆరోపించారు.

P

Telangana | Published On Jan 24, 2026, 5.11 pm IST

Harish Rao | నైనీ టెండర్ రద్దు చేశారంటే.. స్కామ్‌ జరిగినట్టే కదా..? : హరీశ్‌రావు
Advertisement

Harish Rao | సింగరేణి బొగ్గు, సోలార్ టెండర్ల వ్యవహారంపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నిర్వహించిన మీడియా సమావేశంపై మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌ రావు సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. బొగ్గు కుంభకోణంలో అవినీతి జరగలేదని సూటిగా చెప్పలేక, ఉప ముఖ్యమంత్రి విషయాలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. నైనీ టెండర్ రద్దు చేయడమే అవినీతికి నిదర్శనమని, అదే తరహాలో పిలిచిన మిగిలిన టెండర్లను ఎందుకు రద్దు చేయడం లేదని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బొగ్గు కుంభకోణంలో అవినీతి జరగలేదని చెప్పకుండా బీటింగ్ అరౌండ్ ద బుష్ లా ఏదో చెప్పి, మసిబూసి మారేడు కాయ చేశారన్నారు. ఎన్ని సాకులు చెప్పినా మీ కాంగ్రెస్ పాలనలో బొగ్గు కుంభకోణం జరిగింది నిజమని, అందులో రేవంత్ రెడ్డి బామ్మర్ది రింగ్ మెన్ గా పాత్ర పోషించింది వాస్తవమన్నారు. ఏ స్కాం జరగకుంటే నైనీ టెండర్లను రద్దు చేస్తున్నట్లు ఎందుకు ప్రకటించారు? డిప్యూటీ సీఎంను సూటిగా ప్రశించారు.

తాను మరో కుంభకోణం భయపెట్టానని.. సోలార్‌ పవర్‌ స్కామ్‌ గురించి ఎందుకు ఒక్క మాట మాట్లాడలేదని నిలదీశారు. నైనీని రద్దు చేసినట్లే మిగతా అన్ని టెండర్లను ఎందుకు రద్దు చేయడం లేదు..? సైట్ విజిట్ సర్టిఫికెట్ నిబంధనను బీఆర్ఎస్ మీద నెట్టే ప్రయత్నం చేయడం వల్ల నిజాలు అబద్దాలు అయిపోవని.. జరిగిన స్కాంలు, స్కీంలుగా మారిపోవంటూ సెటైర్లు వేశారు. సైట్ విజిట్ నిబంధనను 2018లోనే మొదలైందని చెప్పి, దానికి కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఉదాహరణలుగా చెప్పి ఏం చెప్పదలుచుకున్నారు?.. అది తప్పు కాకుంటే నైనీ ఎందుకు రద్దు చేసినట్టు అంటూ నిలదీశారు. ఇదే సైట్ విజిట్ విధానం సింగరేణిలో కూడా అమలు చేసామని ఇప్పటికైనా ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. సైట్ విజిట్ అమలయ్యింది, నైనీ రద్దు జరిగింది అంటే.. స్కామ్‌ జరిగినట్లే కదా? అంటూ ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం భట్టి అంటే తనకు చాలా గౌరవమని, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిపై విచారణ జరగాలంటే సిట్టింగ్ జడ్జి, కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సీబీఐ మాత్రమే చేయగలవు అన్న ఉద్దేశ్యంతోనే లేఖ రాశానన్నారు. నిజంగా రేవంత్ రెడ్డి, అతని బావమరిది కుంభకోణం మీద నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తానని హామీ ఇస్తే.. భట్టి విక్రమార్కకు లేఖ రాసేందుకు తాను సిద్ధమని స్పష్టం చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement