త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Half day schools | మార్చి 16 నుంచి ఒంటిపూట బ‌డులు

Half day schools | రాష్ట్రంలో ఒంటిపూట బ‌డుల‌పై (Half day schools) పాఠశాల విద్యాశాఖ (School Education Department) కీల‌క నిర్ణ‌యం ప్ర‌క‌టించింది.

D

Telangana | Published On Feb 17, 2026, 3.05 pm IST

Half day schools | మార్చి 16 నుంచి ఒంటిపూట బ‌డులు
Advertisement

Half day schools | రాష్ట్రంలో ఒంటిపూట బ‌డుల‌పై (Half day schools) పాఠశాల విద్యాశాఖ (School Education Department) కీల‌క నిర్ణ‌యం ప్ర‌క‌టించింది. మార్చి 16 నుంచి రాష్ట్ర‌వ్యాప్తంగా అన్ని పాఠ‌శాల‌ల్లో ఒంటిపూట బ‌డులు ప్రారంభించ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. ఈ మేర‌కు ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకే పాఠ‌శాల‌లు న‌డ‌పున్న‌ట్లు తెలిపింది. 12:30 గంటల సమయంలో మధ్యాహ్న భోజనాన్ని అందజేస్తారు.

పదో తరగతి పరీక్ష కేంద్రాలున్న సెంటర్లలో మాత్రం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు బ‌డులు నడుపుతారు. ఇక ప‌రీక్ష‌లున్నంత కాలం 10వ త‌ర‌గ‌తి స్పెష‌ల్ క్లాసులు నడుస్తాయని విద్యాశాఖ ఉత్త‌ర్వుల్లో పేర్కొంది. ఏప్రిల్‌ 24 నుంచి జూన్‌ 11 వరకూ వేస‌వి సెల‌వులు ఇస్తారు. జూన్‌ 12 నుంచి 2026 -27 కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమవుతుంది. రంజాన్‌ నేపథ్యంలో ఉర్దూ మీడియం బడులు, డైట్‌ కాలేజీలకు ఫిబ్రవరి 19 నుంచి మార్చి 20 వరకు ఒంటిపూట నిర్వహించే వెసులుబా టు ఇచ్చింది. ఉదయం 8 నంచి మధ్యాహ్నం 1:30గంటల వరకు వీటిని నడపాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ నవీన్‌ నికోలస్‌ పేర్కొన్నారు. మార్చి 20 తర్వాత బడులు, డైట్‌ కాలేజీలను అదనంగా నడపాల్సి ఉంటుందని స్పష్టంచేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement