Mouth freshner | మౌత్ ఫ్రెషనర్ల పేరుతో గుట్కా విక్రయాలు: ఎంపీ వద్దిరాజు
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన "హెల్త్ అండ్ నేషనల్ సెక్యూరిటీస్ బిల్లు -2025"పై రాజ్యసభలో ఎంపీ రవిచంద్ర సోమవారం సాయంత్రం మాట్లాడారు.
మౌత్ ఫ్రెషనర్ల పేరుతో గుట్కా విక్రయాలు: ఎంపీ వద్దిరాజు
యాలకుల పొడి,మౌత్ ఫ్రెషనర్స్ పేర్లతో పాన్, మసాలా,గుట్కాలు పట్టణాలలోనే కాకుండా గ్రామీణ ప్రాంతాలలో కూడా టీ కొట్లు,పాన్ షాపుల్లో విరివిగా లభిస్తున్నాయని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఆందోళన వ్యక్తం చేశారు. వీటి వాడకానికి అలవాటైన అల్పాదాయ వర్గాలు సరైన ఆహారం తీసుకోక అనారోగ్యానికి గురవుతున్నారని, తమ పిల్లలను చదివించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎంపీ రవిచంద్ర వివరించారు. గుట్కాలు, పాన్ మసాలా, జర్థాల కారణంగా ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని, నోటి,గొంతు కేన్సర్ బారిన పడుతున్నారని చెప్పారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన "హెల్త్ అండ్ నేషనల్ సెక్యూరిటీస్ బిల్లు -2025"పై రాజ్యసభలో సోమవారం సాయంత్రం ఆయన మాట్లాడారు. పొగాకు,దాని సంబంధిత ఉత్పత్తులపై పెంచే సెస్ ద్వారా వచ్చే ఆదాయంలో రాష్ట్రాలకు కూడా వాటా పంచుతామని ఈ బిల్లులో పేర్కొనడం శుభ పరిణామమన్నారు. అలాగే, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో సుమారు 7 లక్షల మంది బీడీ కార్మికులు ఉన్నారని, వీరిలో అత్యధికులు మహిళలు, బడుగు, బలహీన, అణగారిన వర్గాలకు చెందిన వారని తెలిపారు..
16 శాతం క్యాన్సర్..వీళ్లకే
గుట్కాలు,పాన్ మసాలా,బీడీ పరిశ్రమల్లో పనిచేసే వారిలో చాలా మంది నోటి, గొంతు కేన్సర్ బారినపడి హైదరాబాద్ లోని ఎంఎన్జే ఆస్పత్రిలో చేరుతున్నారని ఎంపీ రవిచంద్ర చెప్పారు. అందులో చేరే ప్రతి వంద మందిలో 16 మంది నోటి, గొంతు కేన్సర్ తో బాధపడుతున్న వారేనని ఆయన పేర్కొన్నారు.ఇది జాతీయ సగటు కంటే కూడా ఎక్కువ అని, 2030 నాటికి ఈ సంఖ్య మరింత పెరిగి ప్రమాదకర స్థాయికి చేరుకుంటుందని ఎంపీ వద్దిరాజు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) పొగాకు ఉత్పత్తులపై 75% సుంకాలు విధించాలన్న నిబంధనలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.సెస్ ద్వారా వచ్చే ఆదాయంతో పొగాకు ఉత్పత్తుల వ్యసనాలకు గురైన వారి కోసం డీయాడిక్సన్ కేంద్రాలు మరిన్ని నెలకొల్పాలని, స్క్రీనింగ్ టెస్టులు చేస్తూ, ఉచితంగా ఆరోగ్య సేవలందించాలని కోరారు .పొగాకు ఉత్పత్తుల వల్ల తలెత్తే ఆరోగ్య సమస్యలపై మరింత ప్రచారం అవసరమని ఎంపీ రవిచంద్ర స్పష్టం చేశారు.సెస్ పెంపుదల వల్ల బీడి కార్మికులకు నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని, వారికి ఉపాధి మార్గాలు చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఒక్కొక్కరికి లక్షన్నర రూపాయలు గ్రాంటుగా ఇవ్వాలని సూచించారు.అదేవిధంగా ఆహారశుద్ధి కర్మాగారాల్లో వారికి ఉద్యోగాలివ్వాలని, వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించాలని, వ్యవసాయ రంగంలో ఉన్న వారికి విత్తనాలు, ఎరువులు ఉచితంగా అందించి ఆదుకోవాలని ఎంపీ రవిచంద్ర సలహానిచ్చారు.ప్రజలు కేన్సర్ బారిన పడకుండా అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాల్సిందిగా, అనారోగ్యానికి గురైన వారికి నేరుగా ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని ఎంపీ రవిచంద్ర కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.ఈ బిల్లు ఆమోదం పొందేందుకు తమ పార్టీ బీఆర్ఎస్ మద్దతునిస్తున్నట్లు ఎంపీ వద్దిరాజు చెప్పారు.
సంబంధిత వార్తలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
మే 21, 2026

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
మే 21, 2026

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



