త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Velugumatla | ఇందిర‌మ్మ ఇండ్లు, ఇంటి ప‌ట్టాలు.. వెలుగుమ‌ట్ల భూదాన్ బాధితులకు స‌ర్కార్ గుడ్‌న్యూస్‌..

Velugumatla | ఖమ్మం వెలుగుమట్ల (Velugumatla) భూదాన్ బాధితులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అర్హులైన కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు, ఇంటి ప‌ట్టా ఇస్తామ‌ని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా బుధ‌వారం 311 మందికి ఇంటి ప‌ట్టాలు, ఇందిర‌మ్మ ఇండ్ల మంజూరు ప‌త్రాలు పంపిణీ చేయ‌నుంది.

G

Telangana | Published On Mar 11, 2026, 10.44 am IST

Velugumatla | ఇందిర‌మ్మ ఇండ్లు, ఇంటి ప‌ట్టాలు.. వెలుగుమ‌ట్ల భూదాన్ బాధితులకు స‌ర్కార్ గుడ్‌న్యూస్‌..
Advertisement

Velugumatla | త్రినేత్ర‌.న్యూస్‌: ఖమ్మం వెలుగుమట్ల (Velugumatla) భూదాన్ బాధితులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అర్హులైన కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు, ఇంటి ప‌ట్టా ఇస్తామ‌ని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా బుధ‌వారం 311 మందికి ఇంటి ప‌ట్టాలు, ఇందిర‌మ్మ ఇండ్ల మంజూరు ప‌త్రాలు పంపిణీ చేయ‌నుంది. దీంతోపాటు సొంత ఊరిలో స్థలాలు ఉన్న 101 మందికి ఇంటి నిర్మాణ ప‌త్రాలు ఇవ్వ‌నుంది.

ఖమ్మం సమీపంలోని వెలుగుమట్ల రెవెన్యూ పరిధి వినోబాభావే నగర్‌లోని భూదాన్‌ భూమిలో మొత్తం 742 కుటుంబాలకు చెందిన ఇండ్ల‌ను ఫిబ్రవరి 24న అధికారులు జేసీబీలతో నేలమట్టం చేసిన విషయం తెలిసిందే. నిబంధనలకు విరుద్ధంగా భూదాన్‌ భూమిని ఆక్రమించారని వాటిని తొలగించినట్లు రెవెన్యూ అధికారులు ప్రకటించారు. ఇండ్లు కోల్పోయిన 134కు పైగా కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇండ్ల కూల్చివేత‌పై విప‌క్షాలు ఆందోళ‌న‌కు దిగాయి. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగిన ప్ర‌భుత్వం.. 412 మందిని బాధితులుగా గుర్తించారు.

వారికి కూల్చిన చోటే బాధితులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. భూదాన్ భూముల్లో తొమ్మిది ఎకరాలు కేటాయింపు చేసింది. 311 మంది అర్హులకు 75 గజాల చొప్పున స్థలంతో పాటు ఇందిరమ్మ ఇల్లు కట్టించనున్నట్టు తెలిపింది. ఇప్ప‌టికే బాధితుల‌కు కలెక్టరేట్‌లో అధికారులు టోకెన్లు పంపిణీ చేశారు. మంత్రులు భ‌ట్టి విక్ర‌మార్క‌, తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. బాధితులకు క‌లెక్ట‌రేట్‌లో పట్టాలు పంపిణీ చేయనున్నారు. గడువుకు 4 రోజులు ముందే వెలుగుమట్ల బాధితులకు ఇండ్ల‌ పట్టాలు పంపిణీ చేయ‌నుండ‌టం గ‌మనార్హం.

Advertisement
Advertisement