Velugumatla | ఇందిరమ్మ ఇండ్లు, ఇంటి పట్టాలు.. వెలుగుమట్ల భూదాన్ బాధితులకు సర్కార్ గుడ్న్యూస్..
Velugumatla | ఖమ్మం వెలుగుమట్ల (Velugumatla) భూదాన్ బాధితులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అర్హులైన కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు, ఇంటి పట్టా ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా బుధవారం 311 మందికి ఇంటి పట్టాలు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేయనుంది.
Velugumatla | త్రినేత్ర.న్యూస్: ఖమ్మం వెలుగుమట్ల (Velugumatla) భూదాన్ బాధితులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అర్హులైన కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు, ఇంటి పట్టా ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా బుధవారం 311 మందికి ఇంటి పట్టాలు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేయనుంది. దీంతోపాటు సొంత ఊరిలో స్థలాలు ఉన్న 101 మందికి ఇంటి నిర్మాణ పత్రాలు ఇవ్వనుంది.
ఖమ్మం సమీపంలోని వెలుగుమట్ల రెవెన్యూ పరిధి వినోబాభావే నగర్లోని భూదాన్ భూమిలో మొత్తం 742 కుటుంబాలకు చెందిన ఇండ్లను ఫిబ్రవరి 24న అధికారులు జేసీబీలతో నేలమట్టం చేసిన విషయం తెలిసిందే. నిబంధనలకు విరుద్ధంగా భూదాన్ భూమిని ఆక్రమించారని వాటిని తొలగించినట్లు రెవెన్యూ అధికారులు ప్రకటించారు. ఇండ్లు కోల్పోయిన 134కు పైగా కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇండ్ల కూల్చివేతపై విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగిన ప్రభుత్వం.. 412 మందిని బాధితులుగా గుర్తించారు.
వారికి కూల్చిన చోటే బాధితులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. భూదాన్ భూముల్లో తొమ్మిది ఎకరాలు కేటాయింపు చేసింది. 311 మంది అర్హులకు 75 గజాల చొప్పున స్థలంతో పాటు ఇందిరమ్మ ఇల్లు కట్టించనున్నట్టు తెలిపింది. ఇప్పటికే బాధితులకు కలెక్టరేట్లో అధికారులు టోకెన్లు పంపిణీ చేశారు. మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. బాధితులకు కలెక్టరేట్లో పట్టాలు పంపిణీ చేయనున్నారు. గడువుకు 4 రోజులు ముందే వెలుగుమట్ల బాధితులకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేయనుండటం గమనార్హం.
సంబంధిత వార్తలు

MP Vaddiraju | బీఆర్ఎస్ను దెబ్బతీసేందుకు కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు : ఎంపీ వద్దిరాజు
మే 20, 2026

Vaddiraju Ravi Chandra | ఖమ్మంలో 10 సీట్లు మావే.. ఇక్కడి మంత్రులకు దిమ్మ తిరగడం ఖాయం: ఎంపీ వద్దిరాజు
మే 15, 2026

Indiramma Indlu | సర్కార్ శుభవార్త.. జూన్ 2 నుంచి ఇందిరమ్మ ఇండ్ల రెండో దశ పంపిణీ
మే 13, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



