త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Governor Shiv Pratap Shukla | భార‌తీయ సంస్కృతిలో విశిష్ట‌మైన‌ది రామాయ‌ణం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

Governor Shiv Pratap Shukla | భార‌తీయ సంస్కృతిలో రామాయ‌ణం విశిష్ట‌మైన‌ద‌ని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా (Governor Shiv Pratap Shukla) తెలిపారు. శ్రీరాముడు ధర్మానికి.. సీతమ్మ తల్లి పవిత్రతకు ప్రతీక అని చెప్పారు.

G

Telangana | Published On Mar 27, 2026, 1.42 pm IST

Governor Shiv Pratap Shukla | భార‌తీయ సంస్కృతిలో విశిష్ట‌మైన‌ది రామాయ‌ణం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
Advertisement

Governor Shiv Pratap Shukla | త్రినేత్ర‌.న్యూస్‌: భార‌తీయ సంస్కృతిలో రామాయ‌ణం విశిష్ట‌మైన‌ద‌ని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా (Governor Shiv Pratap Shukla) తెలిపారు. శ్రీరాముడు ధర్మానికి.. సీతమ్మ తల్లి పవిత్రతకు ప్రతీక అని చెప్పారు. రామాయణంలో ఆదర్శ పుత్రుడు, భర్త, పురుషుడిగా నిలబడిన శ్రీరాముడిని స్ఫూర్తిగా తీసుకోవాలని ప్రజలకు సూచించారు. శ్రీరామ న‌వ‌మి సంద‌ర్భంగా హైదరాబాద్‌లోని సీతారాంబాగ్‌ ఆలయం వద్ద శ్రీరామ శోభయాత్రను గవర్నర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ఏండ్ల తరబడి నగరంలో శ్రీరామ శోభాయాత్ర, కల్యాణోత్సవం విశేషంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. శోభాయాత్ర భక్తుల ఐకమత్యానికి నిదర్శనంగా నిలుస్తుందని చెప్పారు. ఇందులో పాల్గొనే భక్తుల ఆధ్యాత్మికత ఉత్సాహం.. నగర వాతావరణాన్ని ఆధ్యాత్మిక భావనలో నిలుపుతుందన్నారు.

శోభాయాత్ర వేళ.. వివాదాస్పద వ్యాఖ్యలు కానీ, రెచ్చగొట్టే వ్యాఖ్యలు కానీ చేయవద్దని హైద‌రాబాద్ సీపీ వీసీ స‌జ్జ‌నార్ (CP Sajjanar) సూచించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చ‌రించారు. శోభాయాత్ర జరిగే తీరును డ్రోన్లు, సీసీ టీవీ కెమెరాలతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని తెలిపారు. దాదాపు 3 వేల మంది సిబ్బందితో భద్రతను ఏర్పాటు చేశామన్నారు. పిక్ పాకెటర్స్‌పై నిఘా కోసం క్రైమ్ టీమ్‌లు ఏర్పాటు చేశామని, షీ టీంలు కూడా శోభాయాత్ర వెంట ఉంటాయని వెల్ల‌డించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement